Posts

Showing posts from August, 2020

ఉండవల్లి గుహలు... వాస్తవాలు

Image
    ఉండవల్లి గుహలు...anantapadmanabhudu .. వాస్తవాలు            కృష్ణాజిల్లా విజయవాడ నగరానికి 15కిమీ దూరంలో,గుంటూరుజిల్లా మంగళగిరికి 4 కిమీ దూరంలో,అమరావతికి10 కీమీ దూరంలో గలబౌద్ధగుహలు  కార్లే గుహలను పోలిన ప్రసిద్ధ బౌద్ధ గుహాలరమం. ఆరామం అనేది గాని గుహలు గాని హిందువుల చరిత్ర లో ఎక్కడా కానరాదు.              క్రీ. శ.2-3 శ తాబ్ద కాలంలో ఇక్ష్వా కుల పాలనలో ఈ గుహలను ఏక శిలా పర్వతా న్ని నాలుగు అంతస్తులుగా తొలిచారు.రెండవ అంతస్తు విశాలంగా వుండి ఎత్తయిన పీఠంపై 12 అడుగుల బుద్ధుని మహాపరినిర్వాన శిల్పాన్ని చెక్కారు.తల క్రింద దిండు కుడిచేయి పైన ఏడమచేయి వుంచారు.బుద్ధుడి తలవద్ద కాళ్లదగ్గర విషాడవవనులిన మల్లులు చక్రవర్తులు బిక్షువుల  శిల్పాలు చెక్కబడి వున్నాయి. కానీ  క్రీ. శ.7 వ శతాబ్దిలో రెండవ మాధవవర్మ బుద్ధుడి తలకి కిరీటం మెడలో హారం చేతికి దండకడియాలు సున్నంతో పెట్టి anantapadmanaabhudini చేసి ఈ గుహలను అనంత పద్మనాభ గుహలు గా మార్చి ఇవి హిందూ గుహాలగా నమ్మించాడు. ఇది ఒక గోబెల్స్ ప్రచా...

జాతక కథల నేపథ్యం

Image
                      బుద్ధుని నిర్వాణం (మరణం) తరువాత మగధ రాజధాని రాజగృహలో క్రీ.పూ. 483లో బౌద్ధ బిక్షువులతో మొదటి సంగీతి (సమావేశం) మహాకాశ్యప అధ్యక్షతన జరిపారు. ఈ సమావేశంలో ఆనందుడు, ఉపాలి మొదలైన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బుద్ధుని బోధనలు విన్నవారందరూ తాము విన్న వాటిని చెప్పగా వాటినన్నింటిని క్రోడీకరించి రెండు గ్రంధాలుగా తీసుకువచ్చారు. ఆవి (1) సుత్తపిటక (2) వినయపిటక . (తాటాకు గ్రంథాలను ఉంచే పెట్టెను పిటక అని పాళీ భాషలో అంటారు)           వందేళ్ళ తరువాత మళ్లీ రెండవ సంగీతి ఏర్పాటైంది. క్రీ.పూ. 247లో అశోకుని కాలంలో అశోకుడు, మొగ్గలిపుత్తతిస్స మొదలైన వారందరూ పాల్గొన్న మూడవ సంగీతి జరిగింది. ఆ సమావేశంలో  మూడో గ్రంథం 'అభిదమ్మ పిటక' తయారైంది. వినయ, సుత్త, అభిదమ్మ... ఈ మూడింటిని "త్రిపిటకాలు' అంటారు.        బౌద్ధ సాహిత్యం మూడు భాగాలైన త్రిపీటకాలలో ఉంది. మొదటి భాగం సుత్తపిటక. సుత్త అంటే సూత్రాలు.పిటక అంటే పెట్టే లేదా గంప. ఇందులో ఐదు నికాయలు (భాగాలు) ఉన్నాయి. దీనిలో బుద్ధుని ఉ...

వజ్రయానం

Image
                 ఆంధ్రదేశంలో బౌద్దానికి చివరి దశ వజ్రయానం. దీనినే మంత్రయానం , తాంత్రిక బౌద్దం అనీ అంటారు.మహాయాన సిద్దాంతాల విశ్వాసాల సహజపరిణామమే వజ్రయానం.బౌద్దంలో ఉపాసకుల ప్రాబల్యం పెరగడంతోనూ,ఇతర సంప్రదాయ ప్రభావాల వల్ల తాంత్రిక ఆలోచనలు దిగుమతి అయ్యాయని ఎడ్వర్డ్ కాంజే అభిప్రాయం.           వాస్తవానికి 7-12 శతాబ్దాల మధ్య కాలంలో భారతదేశంలో  జైనం, శైవం, వైష్ణవం లలో కూడా తాంత్రిక పూజా విధానాలు ప్రవేశించాయి.             బెంగాల్, అస్సాం ప్రాంతాలు తాంత్రిక విద్యలకు జన్మభూములు.తూర్పు భారతంలో వజ్రయానం అధికమని టిబెటన్ గ్రంధాలు తెలిపాయి. బీహార్లో తాంత్రిక విద్యకు విక్రమశిల విశ్వ విద్యాలయం  పట్టుగొమ్మ అయింది.                     చైత్యకులు బౌద్దంలో ధూపదీప గంధాదులతో పూజా విధానం ప్రవేశపెట్టారు. గణరాజ్య ప్రజల ముద్రల ప్రభావం భక్తి మతం లోని మంత్రాల ప్రభావం వలన మహాయానం అంకురించి పరిణామం చెందింది.దీనికి తోడు పాలకులు వీటికి ఎక్కువగా ఆక...

బౌద్ధ సూక్తులు

Image
 ఈ ప్రపంచానికి వెలుపల దీనికి ఆధారమైంది, ఆశ్రయం అయింది ,మరొకటి ఏదీ లేదు. ఈ ప్రపంచం సర్వ సమృద్ధం. సర్వ స్వతంత్రం .తనకు తానే ఆధారమైంది.                     ___బుద్ధుడు మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతిదీ తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. బాలుడు యువకుడు అవుతున్నాడు. యువకుడు వృద్ధుడవుతాడు. ప్రతిదీ ఒక ప్రవాహం. నది  ప్రవహిస్తున్నట్లు ఈ విశ్వం విశాలమవుతుంది.                   __ బుద్ధుడు  ప్రతిదీ ఉన్నది ఒక కొస అయితే ప్రతిదీ లేనిది మరొక కొస అవుతుంది .అసలు సత్యం ఏమంటే ఈ రెండు కొసల మధ్యలో ఉంది.                         ____బుద్ధుడు

భారతదేశంలోతొలి మహిళా సంఘం

Image
( బుద్దభూమి మాస పత్రిక నుండి)( buddhist analysis) భారతదేశంలోతొలి మహిళా సంఘం మహిళా సంఘం పెట్టాలంటే మొదట బుద్దుడు వెనకా ముందాడాడు. ఎందుకంటే, వాళ్ళకు గల భౌతిక ఇబ్బందులుఅవరోధాలవుతాయేమోనని! ఆనందుని వాక్బలంతో, వాదనతోమహా ప్రజాపతి గౌతమి సారధ్యంలో భిక్షుణీ సంఘం స్థాపించాడు. అంతకుముందు ఎవరూ చేయలేదా? ప్రయత్నం కూడా చేయలేదా, మహిళలైనా ముందుకు రాలేదా? వేద కాలంలో స్త్రీలు గార్గి పండిత సభలో స్త్రీల తరుపున వాదిస్తుంటే, మహర్షి (యాజ్ఞవల్కుడు) వారించి, అణచివేస్తాడు. మహర్షికి ఇద్దరు భార్యలు. ఒక భార్య స్వతంత్రించి, జ్ఞానార్జనవైపు మొగ్గి,సన్యాసధర్మంస్వీకరించటానికి అనుమతి కోరుతుంది. ఉపనిషత్కా లంలో కూడా స్త్రీ స్వేచ్ఛకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు లేవు. పురాణకాలంలో స్త్రీలకు పాతివ్రత్యాలు అంటగట్టి, వాళ్ల ముఖాన ఆయాచితంగా వివిధ వ్రతాలు, కాలక్షేప విధులు రుద్దారు. బానిసలుగా మార్చారు. దేవుళ్లకు సైతం పెళ్లాలుగామార్చారు. కృష్ణుడు మాత్రం యాదవ స్త్రీలను మధురలోను, బృందావనంలోను, యమునా తీరాన ఆర్గనైజ్ చేశాడు. ఎందుకు? తను వినోదానికి, అల్లరిచిల్లరి చేష్టలకు. ఆరాధన పేరుతో ఆత్మసంతృప్తికి. వాళ్లకు హక్కులు, అర్హతలు పాడు ఏమీ...

బౌద్ధ, జైనధర్మాల శాంతి,అహింసలే భారతదేశ పతనానికి మూలకారణమా?

Image
        pc: manatelangana బౌద్ధ, జైనధర్మాల శాంతి,అహింస, సమానత్వం మొదలైన వాటితో కూడివున్నవిధానమే భారతదేశపు పతనానికి మూలకారణమని హిందూ మతతత్వవాదులు ఆరోపిస్తూంటారు.ఇది వాస్తవమేనా?                 ఇటువంటి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చరిత్రలో ఏక్కడా కన్పించడం లేదు. బౌద్ధ, జైన ధర్మాల వారి ఉపదేశాలమీద వాటి పరిణామాలమీద హిందూమతవాదులు చేసిన దోషారోపణలకు ధర్మానంద కోశాంబి తమ గ్రంథాలలో సవివరంగా సమాధానాలిచ్చారు. బుద్ధుని మహాపరినిర్వాణం (క్రీస్తుకు పూర్వం 5-12) తరువాత రెండు శతాబ్దాలకు చంద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు జైన ధర్మం స్వీకరించాడని చెప్పబడుతున్నది. కాని గ్రీకులను యీ దేశం నుంచి తరిమిచేసే సమయంలో ఆయనను అహింసా ధర్మం నిరోధించలేదే? ఆయన పౌత్రుడు అశోకుడు పూర్తిగా బౌద్ధుడయిన తర్వాత కూడా విశాలమైన సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నాడే! మహమ్మద్ ఇబ్నకాసిమ్ క్రీ.శ.712లో సింధు ప్రాంతం మీద దాడి చేసినప్పుడు పశ్చిమ హిందూ దేశంలో బౌద్ధమతం నామరూపాలులేవు గదా? అక్కడ బ్రాహ్మణ వర్గ ఆధిపత్యం వృద్ధి చెందుతూ వుందిగదా? ఆ స్థితిలో వున్నప...

ఏది చర్య ......ఏది ప్రతిచర్య..!?

Image
బుద్ధుడు ఖచ్చితంగా చెపుతాడు.. నిశ్శబ్దంగా కూర్చోవటం నేర్చుకోమని. అంటే ఎప్పుడూ నిశ్శబ్దంగా కూర్చోమని  కాదు. మీరు సోమరితనంగా వుండమని కాదు.  ఆ నిశ్శబ్దం నుండి మొదలయ్యేదే చర్య అంటాడు.  మీకా నిశ్శబ్దం తెలీకపోతే; ఆ ప్రశాంతత.. నిశ్చలత్వం.. తెలీకపోతే;  మీరేమి చేసినా అది ప్రతిచర్య అవుతుంది. ఎవరో మిమ్మల్ని అవమానిస్తారు.                మీకు కోపమొస్తుంది.  ఎవరో మిమ్మల్ని పొగుడుతారు.            మీకు సంతోష మొస్తుంది.  ఎవరో మిమ్మల్ని కించ పరుస్తారు              మీరందుకు కుంగిపోతారు. అంటే ఎవరో స్విచ్ నొక్కుతారు.             మీరందుకు స్పందిస్తారు.   అంటే.. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు.  బాధ పెట్టగలరు.  మీలో ద్వేషాన్ని రగిలించ గలరు. మిమ్మల్ని పిచ్చివారిని కూడా చేయ గలరన్న మాట.  ఇతరులననుసరించి మీరు స్పందిస్తూ వున్నారంటే,   ఇతరులప్రభావంతో మీ ప్రవర్తన వుందనికదా అర్ధం. ఇదంతా మీ చర్య ఎలా అవు...

బౌద్ధ ధర్మాల దర్పణం 'బౌద్ధ ధర్మసారం'

Image
            బౌద్ధంపై ఇంతవరకు వచ్చిన పుస్తకాలలో అత్యుత్తమమైనదని అంబేద్కర్ కొనియాడిన గ్రంధం 'బౌద్ధధర్మసారం'. ఈ గ్రంధాన్ని ఆంగ్లంలో వెలువరించిన ప్రధమ తెలుగు రచయిత లక్ష్మినరసు, ఆయన బౌద్ధాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానపు వెలుగులో పాఠకులకు అర్థమయ్యే విధంగా రాసినాడు.            లక్ష్మినరసు భౌతికశాస్త్ర ఆచార్యులుగా మద్రాసు క్రిష్టియన్ కాలేజీలో పనిచేశారు. ఆయన ఈ గ్రంధాన్ని 1911లో రచించారు. ఈ గ్రంధాన్ని ఎంతో అర్ధవంతంగా చక్కని సరళమైన తెలుగులోకి అనువదించాడు చంద్రశేఖర్, బౌద్ధ ధర్మాలను, బౌద్ధంలో వున్న సుగుణాలను, మనిషి పరివర్తన చెందడంలో బౌద్ధ ధర్మం ఉపయోగపడే విధానాన్ని ముఖ్యంగా బౌద్ధంలో వున్న విశిష్ట లక్షణాలను శాస్త్రీయంగా వివరిస్తాడు రచయిత. ఈ గ్రంధాన్ని చదివిన ఏ పాఠకునికైనా బౌద్ధం పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పడటం సహజం.            మానవుని కేంద్రంగా చేసుకుని సమాజం సజావుగా నడవడానికి, మనిషి ఆనందంగా జీవించడానికి ఒక ప్రాపంచిక దృక్పథాన్ని బౌద్ధం అందించిందని రచయిత మనకు చక్కగా వివరిస్తాడు.        ...

బుద్ధుని బోధనలు

Image
           Buddha కుటుంబం: 1. ఒక కుటుంబంలో ఒకరి మనస్సు నొకరితో కలుస్తాయి. అవి ఒకదాని వెంట నొకటి ప్రేమతో వుంటే ఆ కుటుంబం ఒక నందనవనంలా వుంటుంది. అవే ఒకదాని నౌకటితో సమన్వయం లేకపోతే ఆ కుటుంబం తుఫాను భీభత్సానికి గురైన పూలవనంలా వుంటుంది. తప్పులు : 1. నీ సోదరురని తప్పులు వెదకడం ఎంత సులువు. నీ తప్పులను గుర్తించడం ఎంత కష్టం. హృదయానందం, అంతులేని సంతోషం ఇనేవి సాధించాలంటే మొదట దాన్ని త్యజించాలి. రెండవ దాన్ని అందుకోవాలి. 2. తప్పును తప్పుగానూ, ఒప్పును ఒప్పుగానూ చూడండి. నీ మనస్సులోపల పరికించి చూది, సహజంగా ఉండండి. సోమరితనం : 1. సోమరిగా వుండటమంటే చావు దగ్గరగా వెతుక్కోవటమే. కష్టపడే విధానమే సరైన జీవనమార్గము. వివేకవంతులు కష్టపడే మార్గాన్ని ఎన్నుకుంటే బుద్ధిహీనులు సోమరితనాన్ని ఎన్నుకుంటారు. దాచి పెట్టలేనివి : మూడు విషయాలను ఎట్టి పరిస్థితులలోనూ దాచిపెట్టలేవు, అవి సూర్యుడు, చంద్రుడు, సత్యం. అర్ధమవడం : 1. ప్రతి ఒక్కరికి నేను సమానంగా ఉండలేను, కానీ ఎవరికో ఒకరికి ఏదో ఒకటిగా అర్థం అవుతాను, 2. మన వెనుక ముందర ఏమున్నాయనేవి, మనలోపల ఏ ముందనే దానితో పోలిస్తే చాలా చిన్నవి. కార్యా...

జీవితం

Image
1. జీవితాన్ని మంచి పనుల హారంగా మార్చుకోవాలి. 2. ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఎలా వున్నావో అలాగే వుండు. అట్లాకాక పోతే నువ్వు జీవితాన్ని కోల్పోతావు. 3. నువ్వు దేనిని నీతో అతికించుకుని అట్టి పెట్టు కున్నావో, దానిని ఎప్పుడో ఒకప్పుడు వదులుకోక తప్పదు. 4. జీవితం బహుచిత్రమైనది. సుఖాన్ని గురించి తెలుసుకోవటానికి దు:ఖం తెలియాలి. నిశ్శబ్దం గొప్పతనం తెలియాలంటే శబ్దం గురించి తెలుసుండాలి. 5. జీవితంలో బాధ తప్పనిసరి, దాన్ని అనుభవించాలా వద్దా అనేది పూర్తిగా ఐచ్ఛికం.

ధ్యానం

Image
1. ధ్యానం విజ్ఞతను తీసుకొస్తుంది. ధ్యానం లేకపోతే అజ్ఞానంలోకి జారిపోతారు. నిన్ను ముందుకు తీసుకు వెళ్లేది ఏదో, వెనక్కు తీసుకువెళ్లేది ఏదో తెలుసుకో... విజ్ఞతకు దారితీసే మార్గాన్ని ఎన్నుకో. 2. ధ్యానం చేయి, మనసును నిర్మలంగా వుంచు. ప్రశాంతంగా ఉండు, నీ పనిలో పనిమంతులుగా, మబ్బుల నుండి విడివడిన చంద్రునిలా ప్రకాశించు.

నీకెవరో చెప్పినారని నువ్వు నమ్మకు_బుద్దుడు

Image
1. మానవ జీవన ప్రస్థానంలో నమ్మకం అవసరమైనది, ప్రశస్థమైనది. అది లేకపోతే మన మనుగడ కష్టమే. అది గొప్ప సాంత్వన కలిగిస్తుంది.అది గొప్ప ఆస్తి. 2. ఆకాశంలో తూర్పు, పడమరలు లాంటివి ఏ దిక్కులూ లేవు. ప్రజలు తమ మనస్సుల్లో దిక్కులను సృష్టించుకొని అవే నిజమని నమ్ముతున్నారు. 3. నీకెవరో చెప్పినారని నువ్వు నమ్మకు. నీ గురువు చెప్పినాడని నీ గురువుపై వున్న గౌరవం కారణంగా నమ్మవద్దు. అయితే నీ పరిశీలన, విశ్లేషణతో దానిని పది మంది సంక్షేమానికి ఉపయోగపడుతుంటే అప్పుడు దానిని స్వీకరించు. నీకు దారిచూపే మార్గంగా భావించు. 4. నువ్వు చదివినావనో, ఎవరో చెప్పినారనో, నేను చెప్పినాననో నువ్వు నమ్మవద్దు. ఆ విషయం నీకున్న పరిజ్ఞానంతో,వివేచనతో, సృజనాత్మకతతో విశ్లేషించి నీకు సమ్మతమనిపిస్తే, దానిని స్వీకరించు. 5. పురాణాల్లోనో, మత గ్రంథాల్లోనో రాశారని గ్రుడ్డిగా నమ్మవద్దు. పూర్వీకులు చెప్పివారనో, గురువులు చెప్పినారనో నమ్మవద్దు. నీ పరిశీలన, విశ్లేషణతో అందరికీ ఉపయోగపడుతాయో వాటిని గుర్తించి అవి సమ్మతమనిపిస్తే వాటిని స్వీకరించు, ఆచరించు. 6. ఇతరులను అనుమానిస్తూ కూర్చోవడం చాలా భయంకరమైనది. ప్రజల నుంచి నిన్ను అది వేరు చేస్తుంది. మిత్...

మన ఆలోచనలు _ బుద్ధుడు

Image
1. మనమేం ఆలోచిస్తామో ఆ విధంగా మనం          తయారవుతాము. 2. నకారాత్మక (చెదు) ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. వాటిపట్ల జాగ్రత్త  వహించాలి. 3. మన ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని        తయారుచేస్తున్నాం. 4. నీ ఆలోచనలను సరిగ్గా సంరక్షించుకోకపోతే అవి ఏ శత్రువు చేయనంత హాని చేస్తాయి. కాని ఒకసారి నీ ఆలోచనలపై  అదుపు సాధించ గలిగితే నీకెలాంటి సహాయం అవసరంలేదు.చివరకు తల్లిదండ్రుల సహాయం కూడా. 5. మంచి ఆలోచనల్ని కాపీ కొట్టడం సమంజసం కాదు. కాని మంచి అనుభూతుల్ని కాపీ కొట్టడం చాలా మంచిది. పైగా అది నిన్ను అభివృద్ధిలోకి తీసుకు వెళుతుంది. 6. ఎంత మంచి విషయాలు చదివినా, ఎంత గొప్ప విషయాలు మాట్లాడినా, ఎంత మంచి ఆలోచనలు చేసినా వాటిని ఆచరించకపోతే ఏమి ప్రయోజనం ? 7. మనం మన ఆలోచనల ఫలితంగా తయారవు తాము. నిస్వార్థపు ఆలోచనలుగలవారి మాటలవల్ల లేదా చర్యలవల్ల ఆనందం లభిస్తుంది. ఆనందం వారిని నీడలా వెన్నంటి వుంటుంది. అది ఏనాడూ వదలిపోదు. 8. మన జీవితం మన ఆలోచనల ఫలితంగా ఏర్పడినదే. గడచిన కాలంలో నీ ఆలోచనల ఫలితమే వేదు మీరున్న పరిస్థితికి కారణం. నేటి ఆలోచనలే రేపటి భవ...

వాక్కు ప్రాధాన్యతను వివరించిన బుద్ధుడు

Image
             Pc 123rf.com వాక్కు ప్రాధాన్యతను వివరించిన బుద్ధుడు 1. నువ్వు చేసే పని, నీ వాక్కు ఇతరులకు, నీకూ ఉపయోగపడుతున్నప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. 2. కొన్ని వేల వ్యర్థపు మాటల కన్నా శాంతిని, కాంతిని కలుగజేసే మంచిమాట ఒక్కటే చాలు. 3. మొరిగే కుక్కను మంచి కుక్క అని ఎలా అవమో, వాగుడుకాయను సరైన మనిషిగా భావించరు. 4. నాలుక ఒక పదునైన చాకులాంటిది. అది రక్తం కారకుండా మనిషిని చంపేయగలదు. 5.పదాలకున్న శక్తి ఆ పరిమితం. మనిషిని నాశనం చేయగలవు. లేదా గాయాల్ని మాన్పగలవు, పదాలు దయాపూరితమై సత్యమైతే అవి ప్రపంచాన్ని మార్చగలవు. 6. మనం మాట్లాడే మాటలను, పదాలను జాగ్రత్తగా వాడాలి. ప్రజలు వాటిని వింటారు. ప్రభావితులవు తారు. వాళ్ళపై మంచి మాటలు మంచిగానూ, చెడు మాటలు చెడుగానూ ప్రభావితం చేస్తాయి. ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు కాల్చియతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరికూర్చవచ్చునా విశ్వదాభిరామ వినురవేమ.

ఆరోగ్యం పై బుద్ధుని ప్రవచనాలు

Image
1. తన ఆరోగ్యానికి, అనారోగ్యానికి తానే రచయిత 2. ఆరోగ్యం గొప్ప వరం, సంతృప్తి గొప్ప సంపద, నమ్మకం అతి గొప్ప బంధం 3. నీ శరీరం ఎంతో విలువైనది. దివ్యత్వాన్ని సాధించడానికి శరీరమే సాధనం. దీనిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. 4. శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుకోవడం తప్పనిసరి. లేకపోతే మన మనస్సును దృఢంగా, పరిశుభ్రంగా వుంచుకోవడం సాధ్యంకాదు. 5. శారీరక దారుఢ్యాన్ని నిరంతరంగా కాపాడు కోకుండా అంతర్గత ప్రశాంతతను సాధించలేవు. 6. గతాన్ని తలపోస్తూ, భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటూ కష్టాలు వస్తాయోమోనని భయ పడుతూ వుంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వుండలేము. వర్తమాన కాలంలో ఆనందంగా, వివేకవంతంగా జీవిస్తూ వుంటే అన్ని రకాల ఆరోగ్యంగా జీవించవచ్చు. 7. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా, కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలన్నా, అందరికి శాంతిని సాధించాలన్నా, మువ్వు నీ మనస్సుకు క్రమశిక్షణ నేర్పి మనస్సును నీ ఆధీనంలో ఉంచుకోవాలి. మనస్సును ఎవరు తన ఆధీనంలోకి తెచ్చుకుంటారో వారు సర్వజ్ఞానానికి దారిని కనుక్కోగలరు. వివేకం, మంచితనం, వారిని సహజంగా వెన్నంటి వస్తాయి.

ప్రేమంటే ఏమిటో చెప్పిన బుద్దుడు

Image
     నీకొక పుష్పం నచ్చి దానిని పీకితే దానిని ఇష్టపడినట్లు.     అదే ఆ పూల చెట్టును శ్రద్ధగా నీళ్లు పోసి పెంచితే ఆపువ్వును ప్రేమించినట్లు.      అదే ప్రేమకు, ఇష్టానికి గల తేడా.

మనస్సు గురించి బుద్ధుని వచనాలు

Image
మనస్సు గురించి బుద్ధుని వచనాలు 1. ఉత్సాహముంటే జ్ఞానం లభిస్తుంది. ఉత్సాహం లేకపోతే జ్ఞానం పోగొట్టుకుంటారు. 2. నీకు నిత్యం అపవాదులు, పొగడ్తలు ఎదురవుతూ వుంటాయి. కాని అవి నీ మనస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. 3. చెడు పనులవైపు దృష్టి సారించేది నీ మనస్సు, నీ శత్రువు ఎంత మాత్రమూ కాదు. 4. క్రమశిక్షణ లేని మనస్సు అవిధేయతగా ఉన్నంతగా ఏది వుండదు. క్రమశిక్షణగల మనస్సు విధేయతగా ఉంటుంది. 5. ఆపనమ్మకమైన చెడు తలంపులు కలిగిన మిత్రుని చూచి భయంకరమైన జంతువుకంటే ఎక్కువ భయపడాలి.      భయంకర జంతువు నీ శరీరానికి హానితల పెట్టవచ్చు. కాని చెడు తలంపులు గల మిత్రుడు నీ మనస్సును గాయపరుస్తాడు. 6. ఒక వ్యక్తి పరిపూర్ణ ఉదాత్త గుణంగల హృదయం గలవాడైతే అతని పరిసరాలన్నింటిని ఉదాత్తంగా మార్చి వేస్తాడు. 7. మనస్సే అన్నింటికి మూలం. నీ మనస్సులోకి బురదచల్లుకుంటే నీకు బాధలు వెన్నంటి వస్తాయి. ఎద్దు వెంబడి ఎలా చక్రాలు వస్తాయో అలా. నీ మనస్సును మంచి భావాలతో నింపుకుంటే నీ మాటలు, నీ చేష్టలలో మంచి పొంగిపొరలి ఆనందం ఎల్లప్పుడూ నీడలా నిన్ను ఆంటి పెట్టుకుంటాయి. 8. నీ గాయాల్ని, దుఃఖాన్ని ఎవరూ మాన్ప...

కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు బుద్దుడు చెప్పిన మాటలు

Image
1. నీవు కోసంతో ఉండటమంటే ఇతరులు చేసే తప్పులు నిన్ను దహించటమని అర్ధం 2. నీవు కోపగించుకోవటమంటే నిప్పు కణిక చేతిలో పట్టుతాని ఇతరుల మీదకు వేయాలనుకోవడం వంటిది. అది నిన్నే కాలుస్తుంది. 3. ప్రశాంతత కోసం బయట వెదకరాదు. అది నీలోపల మంచే వస్తుంది. 4. నీలో కోపం వుంటే బయట శత్రువు పొంచి వుంటారు. 5. నీ కోపాన్ని చూసి ఎవరూ నీకు దండన విధించరు. నీ కోసమే నీకు దండన విధిస్తుంది. 6. వేలాది మందిని యుద్ధంలో జయించటంకన్నా తన్ను తాను గెలుచుకోవడం ఎంతో గొప్పది. 7. ద్వేషాన్ని ద్వేషంతో అంతం చేయలేము. అది ప్రేమతోనే సాధ్యం. ఇదొక సార్వజనీన సత్యం. 8. నీలో కోపాన్ని రగించటం సాధ్యం కానప్పుడు నీ చుట్టూ శత్రువులు ఎవరూ ఉండరు. 9. మనసులో వ్యతిరేక భావాలు వున్నంత సేపూ నీ కోపం ఎట్టి పరిస్థితుల్లోనూ మాయం కాదు. అదే వ్యతిరేక భావాల్ని మరచిపోతే నీలోని పోపం మటుమాయమవుతుంది. 10. నీ పట్ల నీవు మంచిగా వున్నావంటే ఇతరులను నువ్వు క్షమిస్తున్నట్లే, 11. ఇతరులను జయించటం కన్నా నిన్ను నీవు జయించుకోవడం ఉత్తమోత్తమం, అదే నీ అంతిమ విజయం. 12. నీ మనస్సును విశాలం చేసుకో, నీ జీవితం ఎంతో సుఖవంతమవుతుంది. గ్లాసు నీళ్ళలో చిటికెడు ఉప్పు, నీళ్ళను ఉప్పగా మ...

బుద్ధుని ప్రవచనాలు

Image
                       1. ఎవరైతే తానొక పనిని చేయగలనని బలంగా నమ్ముతాడో, అతడు ఆ పనిని పూర్తి చేయగలడు. 2. గమ్యం చేరడానికి మార్గం ఆకారంలో లేదు. హృదయంలో మార్గం వుంది. 3. జీవిత లక్ష్యం ఏమిటంటే నీ కర్తవ్యాన్ని గుర్తించడమే. తరువాత నీ హృదయాన్ని ఆ కర్తవ్యానికి అంకితం చేయడమే. 4. నిన్ను ఎవరూ రక్షించలేరు. ఎవరూ ఏమి చేయలేదు. చేయబోరు, నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలి. (ఎవరోవస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా ! నిజం మరచి నిదురపోకుమా ! ) 5. చాలా మందికి మార్గాలు తెలుసు, కొంత మంది మాత్రమే తనమార్గంలో ప్రయాణించగలరు. 6, తాను తన మార్గాన్ని కనుగొన్నవాడు. ఇతరులకు మార్గాన్ని సూచించగలడు, 7. సత్యాన్వేషణ కోసం జరిగే ప్రయాణంలో రెండు తప్పులు జరిగే అవకాశముంది. ఒకటి ప్రయాణం చివరి వరకు సాగించకపోవటం, రెండవది అసలు ప్రారంభించకపోవటం. 8. గమ్యం చేరడానికి మార్గం కాదు, మనస్సుండాలి. 9. తనకు ఇష్టమన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు. బుద్ధిమంతుడు మాత్రం తను చేసే ప్రతి పనిని ఇష్టంగా మార్చుకుంటాడు. 10. నీవు నీ దిశను మార్చుకోకపోతే నీవు నీ గమ్యాన్ని చేర...