అంబేద్కర్ అడుగుజాడల్లో
అంబేద్కర్ అడుగుజాడల్లో.. (తేదీ:14/4/2020 అంబేద్కర్ జయంతి సందర్భంగా) రాజ్యాంగ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన ఉపన్యాసంలో "నాయకుడిని గుడ్డిగా నమ్మి పూజించడమనే చెడు మనస్తత్వం భారతీయుల్లో అనాదిగా జీర్ణించుకుని ఉంది. దేశానికి, ప్రజానీకానికి నిస్వార్ధంగా సేవ చేసిన నాయకుని గౌరవించడంలో తప్పులేదు. కానీ ఆ నాయకున్ని సర్వశక్తి సంపన్నుడుగా ఎంచి సమస్తమైన బాధ్యతలు ఆయనపైనే ఉంచి, అన్యధా శరణం నాస్తి అనే ధోరణిలో ప్రజానీకం వ్యవహరించడం అత్యంత విషాదకర పరిణామాలకు దారి తీస్తుంది. ఈ వ్యక్తి పూజ విధానం దేశానికి, ప్రజానీకానికి అత్యంత నిమ్నదశగా దిగజారుస్తుంది. దేశ స్వాతంత్రంను పరిరక్షించుకునే విషయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం అనేది ప్రమాదకరం" అని అన్నారు. మన భారతదేశంలో భక్తి తత్వం అనేది అత్యంత దారుణమైన విధంగా ఉంటోంది. ఈ భక్తితత్వం నింపాదిగా రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించింది. వ్యక్తి పూజ దేశాన్ని కృంగదీసి సర్వ ఆధిపత్యానికి దారితీస్తోంది. అదేవిధంగా రాజకీయాల్లో భక్తి తత్వానికి వ్యక్తిపూజకు ఏ మాత్రం ...