Posts

Showing posts from November, 2021

నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!!

నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!!                    --Dr. Devaraju Maharaju  ———————————————————————   దీపావళి అంటే దీపాల వరుస. చుట్టూ ఉన్న చీకట్లను  పారద్రోలి వెలుగు నింపడానికి సంకేతంగా ఆ పండగ చేస్తున్నామని చెపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయం అని కూడా చెపుతారు. అయితే, దాని చుట్టూ అల్లుకున్న పౌరాణిక గాథలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు, నరకాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సొమ్మసిల్లి పోయాడనీ, పక్కనే ఉన్న సత్యభామ ఉగ్రరూపం దాల్చి, బాణాల వర్షం కురిపించి నరకాసురుణ్ణి సంహరించిందనీ – ఒక పౌరాణిక గాథ ఉంది. మహకాళి రాక్షస సంహారం చేసినందుకు దేవీనవరాత్రులు జరుపుకున్నట్టు – మరో కథనం ఉంది. ఇవి కాక, దశ-హర (దసరా)కు, దీపావళికి దగ్గరి సంబంధం ఉంది. ఆ రెండు పండుగలు వెంటవెంటనే వస్తాయి. రాముడు లంకాధీశుడైన పదితలల రావణుణ్ణి చంపినందువల్ల దసరా జరుపుకుంటున్నామని చెపుతారు. దశ-హరా అంటే పది తలలు నరికేయడం. రావణుడి పది తలలు నరికి సంహరించిన తర్వాత, రాముడు సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటున్నామని కథ చెపుతారు. ప...

బౌద్ధం భారత దేశంలో ఎలా నాశనమయింది?

        గౌతమ బుద్దునిగా పేరు గాంచిన బుద్దుని అసలు పేరు సిద్దార్థ్. ఇతను సాధారణ శకం కు పూర్వం 563 లో జన్మించి 483 లో మరణించాడు. అంటే బుద్దుడు మొత్తం 80 ఏళ్ళు జీవించాడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి.మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి. సిద్ధార్ధుడు కపిలవస్తు నగరానికి చెందిన లుంబినిలో  జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది.ర్భావతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. ప్రయాణ మార్గ మధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తోంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడ ని నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి( గౌతమి)పెంపకంలో పెరుగుతాడు.  గౌతమి పెంచినందువల్ల   అతన్ని  గౌతముడన్నారు. సిద్దార్డ్ 16 ఏళ్ల వయసు వచ్చే సరికి యశోధర ను...