ద్వేషం దేనికీ పరిష్కారం కాదు.
ద్వేషం దేనికీ పరిష్కారం కాదు. బుద్ధుడు తన కాలంలోని బ్రాహ్మణులలోని 'బ్రాహ్మణులు ఎక్కువ వారు, తక్కిన వారు తక్కువ వారు, జ్ఞానాన్ని, ముక్తిని పొందటానికి బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంది' అనే ఆధిక్యతాభావాన్ని తిరస్కరించాడు. మానవ సమానత్వాన్ని ప్రకటించాడు. అంతేగాని ఎవ్వరినీ ద్వేషించలేదు. వేదాలను చదవటంవల్ల, చదివించటం వలన, యజ్ఞ యాగాలవలన దుఃఖవిముక్తి కలుగదని, రాగ, ద్వేష, మోహాలను వదలటం వల్లనే అది సాధ్యమౌతుందని అన్నాడు. బ్రాహ్మణ పదాన్ని బుద్ధుడు జ్ఞానికి పర్యాయంగా ఉపయోగించాడు. పుట్టుక తో ఎవడూ బ్రాహ్మణుడు కాడని చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాలను తిరస్కరించాడు. అతడు జ్ఞానవాది. ఆయన మాటల్లోని సత్యాన్ని గుర్తించిన ఎందరో బ్రాహ్మణులు ఆయన శిష్యులైనారు. తర్వాత అశోకుని కాలం నుండి బౌద్ధానికి ప్రాధాన్యం లభించటం వలన వైదికం వెనకబడి పోయింది. దానిని సహించలేని బ్రాహ్మణులు చివరి మౌర్యరాజును చంపి రాజ్యాన్ని చేజిక్కించుకొన్నారు. అప్పటి నుండి బౌద్ధాన్ని అణిచివేయటం మొదలై ముస్లింల దండయాత్రల అది అనేక విధాలుగా సాగింది. అందులో భాగమే బుద్ధున్ని దశావతారాలలో చేర్చటం. మనుస్మృతిని రాసి శూద్రులను అంటరాని వారిగా, జంతువుల కన్న హీ...