Posts

Showing posts from March, 2025

బౌద్ధ తాత్విక చింతన

బౌద్ధ తాత్విక చింతన ప్రతి మనిషికీ తాత్విక ఆలోచనలు ఉంటాయి. ఈ ప్రపంచం ఎలా ఉద్భవించింది? సృష్టికర్త ఎవరు? మరణం తర్వాత మనిషికి ఏమవుతుంది? ఆత్మ ఉన్నదా? స్వర్గం, నరకం నిజమేనా? ఇవి తరతరాలుగా మనుషుల్ని ఉత్కంఠగా ఉంచిన ప్రశ్నలు. అయితే బుద్ధుడు ఈ ప్రశ్నలపై చర్చించవద్దని సూచించాడు, ఎందుకంటే ఇవి స్పష్టమైన సమాధానాలకు దారి తీసే అంశాలు కావు. అయినా, బుద్ధుడు కొన్ని కీలకమైన తాత్విక సిద్ధాంతాలను ప్రతిపాదించాడు: 1. కార్య-కారణ సంబంధం – ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. 2. క్షణిక వాదం – ఈ లోకంలో శాశ్వతమేమీ లేదు, అన్నీ క్షణికమైనవే. 3. అనాత్మవాదం – ఆత్మ అనేది不存在 (లేదని) బుద్ధుడు పేర్కొన్నాడు. 4. ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం – ప్రతిదీ పరస్పర సంబంధంతోనే ఉనికిలోకి వస్తుంది. 5. చలనం – ప్రపంచంలోని ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. 6. ఆచరణ – ధర్మాన్ని అనుసరించడంతోనే జ్ఞానం పొందగలం. బౌద్ధ తాత్వికత Vs ఇతర సిద్ధాంతాలు ఉపనిషత్తుల ప్రకారం, ఆత్మ శాశ్వతమని, అది మార్పులకతీతమని చెబుతారు. అయితే బుద్ధుడు, ప్రతిదీ మార్పు చెందే ప్రకృతిలో ఆత్మ మాత్రమే శాశ్వతంగా ఉండటం తప్పుడు తర్కమని చెప్పాడు. ఈ కారణంగా ఆయన అనాత్మవాదాన్ని ప్రతిపాదించా...

బౌద్ధ తాత్వికచింతన

బౌద్ధ తాత్వికచింతన                                           ప్రతి వ్యక్తి ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తాడు.ఈ ప్రపంచం ఎలా వచ్చింది? సృష్టి ఎలా వచ్చింది? సృష్టికర్త ఎవరు? మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు? స్వర్గం నరకం ఉన్నాయా? అదే సమయంలో దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ నిరంతరం సాగుతూ ఉంటుంది. అయితే బుద్ధుడు వీటి గురించి చర్చించవద్దన్నాడు. ఎంతకు సమాధానం రాని తేలని అంశాలపై చర్చ వద్దన్నాడు.          బుద్ధుడు మౌలికమైన విషయాలను చెప్పినాడు. వాటిల్లో ముఖ్యమైనవి ప్రకృతి చలనం, క్షణిక వాదం, అనాత్మవాదం, కార్యకారణ సంబంధం,శూన్యవాదం, ప్రతీత్య సముద్పాద సూత్రం, ఆచరణ.           విశ్వంలో ప్రతిదీ అశాశ్వతం. శాశ్వతంగా ఉన్నది ఏదీ లేదు. చలనం లేకుండా ఉన్నది ఏదీ లేదు. ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది ఇప్పుడున్న ప్రకృతి మరుక్షణంలో మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనిషి దుఃఖం శాశ్వతం కాదు. అది కూడా మారుతూ ఉంటుంది. మనిషి కూడా మారుతూ ఉంటాడు. సమాజం మారుతూ ఉంటుంది. దీన్నే...
బౌద్ధం _ మానసిక వికాసం       సరికొత్త జీవన విధానానమంటే ఏమిటో ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాడానికి బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలు పంచశీల దోహదపడతాయి. ఈ ఆదర్శాన్ని ఎలా ఆచరణలో పెట్టాలన్న అంశాన్ని ఇందులో మీరు చూస్తారు .        ప్రతి వ్యక్తి నా ఊరు, నా కులం,నా కుటుంబం లాంటి సంకుచిత వలయాన్ని వదిలేసి, బయటకు రావడం ఎలాగో నేర్చుకోవాలి.అందరినీ మీ సొంత మనుషులుగా అంగీకరించడం ఎలాగో నేర్చుకోవాలి.       ఇతరులతో కలసి జీవించడం వల్ల సమష్టి కృషితో, పూర్తి శ్రద్ధతో ఏ పని అయినా ఎలా పూర్తి చేయాలో నేర్చుకోవాలి.        మనమందరం కలసికట్టుగా ఈ దేశానికి హాని కరమైన అంశాన్ని ఎదుర్కొనే బలాన్ని సంపాదించుకోవాలి. అలాగే, దేశానికి ఉపయోగపడే కార్యాలను సాధించాలి. ఆనందంగా ఉండండి       మనిషి ఆనందంగా ఉండటానికి ఏమి చేయాలో తెలీక రోజూ కామెడీ సినిమాలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొంత మందైతే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ క్రుంగిపోతూ వుంటారు. సంతోషమనేది ఇతరులతో పంచుకుంటే వస్తుంది. ఒక దీపంతో వేల దీపాలను వెలిగించవచ్చు. అలాగే ఆనందాన్ని ఇతరులతో పం...

శీలవంతులైన వారు

ఎప్పుడైనా శీలవంతులైన వారు ఒక ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇంటి వారు ఐదు కారణాలతో ఎంతో పుణ్యం గడిస్తారు. ఏమిటా ఐదు ? (1) శీలవంతులైన వారు తమ గృహానికి రావడాన్ని చూసినప్పుడు, వారి హృదయాలు ప్రకాశవంతమైనప్పుడు .  (2) తమ ఇంటికి వచ్చిన వారికి గృహస్థులు లేచి నిలబడి శ్రద్ధాంజలి ఘటించి , కూర్చొనడానికి ఆసనాలు ఇచ్చినప్పుడు  (3) తమ కుటుంబాలకు శీలవంతులైన వారు వచ్చినప్పుడు తమ లోభితనం మరకను తొలగించినప్పుడు 4)తమ ఇండ్లకు వచ్చిన శీలవంతులైన వారికి, గృహస్థులు అతని సామర్థ్యానికి అనుగుణంగా, వారి బలానికి అనుగుణంగా తమకు ఉన్న దాంట్లో పంచుకున్నప్పుడు.  (5) తమ ఇండ్లకు వచ్చిన శీలవంతులైన వారినుంచి కుటుంబీకులు వారి బోధలను ప్రశ్నించి, విచారణ చేసినప్పుడు ఇంక ఇతర ధర్మాన్ని విన్నప్పుడు. (అంగుత్తరనికాయం,5.199) భారత దేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.        భారతదేశ చరిత్ర ఆర్యుల దండయాత్రతో మొదలవుతుంది. ఆర్యులు ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడే తమ సంస్కృతిని కాపాడుకోగలిగారు. ఆర్యుల సంస్క్రతి, వాళ్ళ సామాజిక వ్యవస్థ ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ రాజకీయ చరిత్ర గురించి మాత్రం మనకు తెలిసింది చాలా తక్కువ. అయిత...

బౌద్ధంలో విశిష్టమైన లక్షణం

బౌద్ధంలో విశిష్టమైన లక్షణం " ఎవ్వరో చెప్పినారని గ్రుడ్డిగా నమ్మకుండా తనంత తాముగా సత్యాన్నితెలుసుకోమని చెప్పడం" బుద్ధుడు 'నీకెవరో చెప్పినారని నమ్మకు, నీ గురువు చెప్పినాడని నీ గురువుపై ఉన్న గౌరవం కారణంగా నమ్మవద్దు. అయితే నీ పరిశీలన, విశ్లేషనతో దానిని పది మందికి ఉపయోగపడతుంటే అప్పుడు దానిని స్వీకరించు. నీకు దారి చూపే మార్గంగా భావించు" అంటూ స్వీయ సాధనకు పెద్దపీట వేసాడు. అలాగే పురాణాల్లో, మత గ్రంథాల్లోనూ రాశారని గ్రుడ్డిగా నమ్మవద్దని కూడా చెప్పినాడు. పూర్వీకులు చెప్పినారని,గురువులు చెప్పినారని నమ్మవద్దు. స్వీయపరిశీనలతో, విశ్లేషణతో అవి సమ్మతమనిపిస్తే, వాటిని స్వీకరించవచ్చని, ఆచరించవచ్చని చెప్పినాడు. కాని నేడు సమాజంలో సంప్రదాయవాదులే ఎక్కువ.వీరు మారరు.ఇతరులను మారనివ్వరు. సమాజం మారాలంటే బౌద్ధధర్మాలుపాటించేవారు పెరగాలి. అంటే బౌద్ధం విస్తారం కావాలన్నమాట.        మనిషి ధర్మపరివర్తన చెందటానికి కోపాన్ని నిగ్రహించుకోవటం ఒక పార్శ్వమైతే, అసూయను పరిహరించుకోవటం రెండో పార్శ్వం. ఇతరులను చూసి అసూయ చెందువాడు ప్రశాంతంగా ఉండలేదు. అసూయ మనిషిని దహించివేస్తుంది. అసూయను మించిన నేరం ఏదీ లేదన్నాడు బ...

నేటి ప్రపంచంలో బౌద్ధ ధర్మం ప్రాధాన్యత

నేటి ప్రపంచంలో బౌద్ధ ధర్మం ప్రాధాన్యత ఎల్లప్పుడూ వేగంగా సాగే ఈ యాంత్రిక యుగంలో, మనస్సును అల్లాడించే శబ్దాలూ, తార్కికతను చెదరగొట్టే గందరగోళమూ మానవ జీవితంలో విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అంతరాత్మకు శాంతినిచ్చే మార్గాన్ని అన్వేషించే వారి కోసం బౌద్ధ ధర్మం నిత్యకాలిక జ్ఞానాన్ని, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. ముఖ్యంగా, ఆధునిక జీవిత సంక్లిష్టతలను ఎదుర్కొంటున్న యువతకు ఇది వెలుగుదారి. డిజిటల్ యుగంలో మైండ్‌ఫుల్‌నెస్ (ప్రజ్ఞా నిరంతర చైతన్యం): స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ఆధిపత్యం కల ఈ యుగంలో మనస్సు విభ్రాంతిగా మారుతోంది. బౌద్ధ ధర్మం బోధించే మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా యువత తన చిత్తాన్ని నియంత్రించుకోవచ్చు. ప్రస్తుత క్షణానికి చైతన్యంతో జీవిస్తూ, గందరగోళంలో స్పష్టతను సాధించవచ్చు. కరుణ మరియు అనురాగం: ఆత్మకేంద్రితతా, విభజనలతో కూడిన సమాజంలో బౌద్ధ ధర్మం ఉపదేశించే కరుణా భావన జీవితానికి శాంతి తెస్తుంది. అన్ని జీవులు పరస్పరం అనుబంధమై ఉన్నాయని తెలుసుకుంటూ, సమానంగా ప్రేమను పంచుకునే గుణాన్ని యువతలో అభివృద్ధి చేయడం ద్వారా మానవత్వం పెంపొందుతుంది. నిర్ణయాలలో ప్రజ్ఞ (జ్ఞానం): అనిశ్చితితో, వేగవం...
బౌద్ధం మహిళల గురించి ఏం చెప్పింది?                  భారతదేశంలో బౌద్ధ తాత్విక విప్లవం అనేక మార్పులను తీసుకు వచ్చింది. అందులో ప్రధానంగా స్త్రీల వ్యక్తిత్వ నిర్మాణానికి బౌద్ధం చేసిన కృషి చారిత్రాత్మకమైంది.  బౌద్ధాన్ని అశోకుడు స్వీకరించిన తర్వాత అది తాత్విక దశ నుంచి సామాజిక దశకు విస్తరించింది.భారతదేశం బౌద్ధ భూమిగాను, విముక్తి మార్గంగాను ఆనాడు గోచరించింది. క్రీ.పూ. 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 8 వ శతాబ్దం వరకు బౌద్ధ సంస్కృతి తన అహింసా సిద్ధాంత ఆచరణని భారతదేశంలో ప్రతిఫలింపచేయగలిగింది.ఈ మొత్తం కృషిలో స్త్రీలదే ప్రధాన పాత్ర. సిద్దార్ధ- యశోధరల వివాహాన్ని బట్టి ఆనాడు బాల్య వివాహాలు లేవు. వారిద్దరు సమ వయస్కులని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. వివాహాన్ని బౌద్ధులు ఆదిలో పవిత్రమైందిగా ఎంచలేదు. వివాహాన్ని సామాజిక, ఆర్థిక ఒప్పందంగానే భావించారు.* *అవసరమైనప్పుడు విడిపోయి బౌద్ధ బిక్షువులుగా చేరవచ్చు. ఒకసారి బుద్దుణ్ణి పెంచిన మహాప్రజాపతి గౌతమి బౌద్ధ మతంలో చేరాలని నిశ్చయించుకుని...బుద్దుణ్ణి ఆశ్రమంలో చేర్చుకోమని ప్రాధేయపడుతుంది.* *అయితే బుద్దుడు నిరాకరిస్తాడు...
జీవితం పట్ల ఆశావాహ దృక్పథం కలిగి ఉండాలి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.      కుటుంబంతో, స్నేహితులతో కలిసి సంతోషంగా రోజులో కొంత సమయాన్ని గడపాలి.  రోజులో కొంత సమయాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచడానికి పుస్తకాలను చదవాలి. మైత్రి భావనను పెంచుకోవడానికి ప్రపంచంలో అందరూ బాగుండాలని సానుకూల దృక్పథంతో కోరుకోవాలి. ద్వేషం దేనికీ పరిష్కారం కాదు. బుద్ధుడు తన కాలంలోని బ్రాహ్మణులలోని 'బ్రాహ్మణులు ఎక్కువ వారు, తక్కిన వారు తక్కువ వారు, జ్ఞానాన్ని, ముక్తిని పొందటానికి బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంది' అనే ఆధిక్యతాభావాన్ని తిరస్కరించాడు. మానవ సమానత్వాన్ని ప్రకటించాడు. అంతేగాని బ్రాహ్మణులను ఎవ్వరినీ ద్వేషించలేదు. వేదాలను చదవటంవల్ల, చదివించటం వలన, యజ్ఞ యాగాలవలన దుఃఖవిముక్తి కలుగదని, రాగ, ద్వేష, మోహాలను వదలటం వల్లనే అది సాధ్యమౌతుందని అన్నాడు. బ్రాహ్మణ పదాన్ని బుద్ధుడు జ్ఞానికి పర్యాయంగా ఉపయోగించాడు. పుట్టుక తో ఎవడూ బ్రాహ్మణుడు కాడని చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాలను తిరస్కరించాడు. అతడు జ్ఞానవాది. ఆయన మాటల్లోని సత్యాన్ని గుర్తించిన ఎందరో బ్రాహ్మణులు ఆయన శిష్యులైనారు.      ...

Discovering the Relevance of Buddhism

Discovering the Relevance of Buddhism in Today's World In a fast-paced world filled with constant noise and distraction, many seek solace and meaning. Buddhism, with its timeless wisdom and practical teachings, offers a path towards inner peace and fulfillment, especially for the youth navigating the complexities of modern life. Mindfulness in the Digital Age: In an era dominated by smartphones and social media, Buddhism's emphasis on mindfulness provides a much-needed antidote to digital overload. By cultivating present-moment awareness, young people can regain control over their attention and find greater clarity in an increasingly fragmented world. Compassion and Empathy: In a society often characterized by divisiveness and self-interest, Buddhism's teachings on compassion and empathy offer a powerful alternative. By recognizing the interconnectedness of all beings, youth can cultivate a sense of universal love and empathy, fostering a more compassionate and harmonious w...

ashtanga

. 1. సమ్యక్ దృష్టి  2. సమ్యక్ సంకల్పం  3. సమ్యక్ వాక్కు  4. సమ్యక్ కర్మ  5. సమ్యక్ జీవనం  6. సమ్యక్ వ్యాయామం  7. సమ్యక్ స్మృతి  8. సమ్యక్ సమాధి

బౌద్ధం సనాతనం

బౌద్ధం సనాతనం      మానవులు, జంతువులు ఆక్సిజన్ ను పీల్చి బ్రతుకుతారు. కాబట్టి "ఆక్సిజన్ని పీల్చి బ్రతకడం" మానవులు, జంతువుల"ధర్మం". సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అది దాని ధర్మం. కుక్క విశ్వాసంగా ఉంటుంది అది దాని ధర్మం.అంటే ధర్మాలు సహజాతాలు. అవి మనకి మనుగడ నిస్తాయి.       తోటి మనిషిని తనతో పాటు సమానంగా చూడడం నేటి సామాజిక విలువ. ఇలా చూడడం అనేది పూర్వం జరిగేది కాదు .అది ఆనాటి సామాజిక విలువ. ఈ సామాజిక విలువలు మానవ సమాజం మారే క్రమంలో మారిపోతూ ఉంటాయి. ధర్మం అలా కాదు.      సామాజిక 'విలువకు', 'ధర్మా'నికీ ఉన్న తేడా ఇది. మనం, ఒక ఆహార పదార్ధాన్ని అనేక రకాలుగా, అనేక రూపాలుగా తయారు చేసుకొని తింటాం. ఎన్ని రూపాలుగా తిన్నా ఆ ఆహార పదార్థం మనకి అందించే శక్తి. విటమిన్లు మాత్రమే మనల్ని బ్రతికిస్తాయి. "సామాజిక విలువలు,కట్టుబాట్లు" అనేవి ఆహార పదార్థాల రూపాలు మాత్రమే! దానిలోని శక్తి, విటమిన్లే దాని "ధర్మం", ఆ శక్తి, విటమిన్లు అందితేనే మనకు సుఖం. బ్రతుకు, మనుగడ, "ధర్మం" అనేది కూడా అంతే..! మొన్నటి వరకూ వెయ్యి రూపాయిల నోటుకి విలువ ఉంది. కానీ ఆ వె...

four kinds of people

🪷Tathagata Buddha told his monks that there are 'four kinds of people' in the world. ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ We must recognize which type of people are good.      🌱The first type of people live only for their selfishness. Only their interests are important to them. They do not really care about the welfare of others. They do not have any pity, mercy or compassion.  🌷The second type of people can suppress their lusts through sadhana. They do not have bad nature. They can eradicate their evil nature. Thus they are happy. But they do not give others the knowledge of how to suppress their lusts or how to eradicate evil nature and evil nature. Don't even try.   🌺There is a third type of people who care about the well-being of others without caring about their own well-being.  🌹 And the fourth type of people are those who cannot conquer their lusts. They cannot give up their evil nature. Have a bad temper. But others want to avoid ...

Lumbini Garden

Lumbini Garden            By 600 BCE, small gana kingdoms and clan confederations had formed in the southern regions of Nepal. One of them was the Shakya kingdom. By 250 BC, these southern regions came under the influence of the Mauryan Empire under Ashoka. By the 4th century AD the Lichchavi dynasty came to power. By then most of Nepal came under the influence of the Gupta Empire. Those in Kathmandu valley in Nepal are called Kiratas. A Gorkha king named Prithvi Narayan Shah consolidated all the valley kingdoms (including Kirtipur state) by 1769. By 1923 it was internationally recognized as a separate country.                 Predominantly Hindu, Nepal is known as a Hindu country, but after the Maoist party came to power in the 2006 elections, it became a secular democratic republic.          Lumbini Garden is a popular Buddhist pilgrimage site in the Rumapdehi district of Nepal. The ear...
అష్టాంగ మార్గం మొత్తం ఎనిమిది అంశాలుగా ఉంటుంది. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోణంలో రాస్తున్నందున, దీనిని యువతకు ప్రయోజనకరంగా, ఆచరణాత్మకంగా ఎలా మారుస్తామో చూద్దాం. 1. సమ్యక్ దృష్టి (Right View) – స్పష్టత & గమనించగల సామర్థ్యం తప్పు-నిజం మధ్య తేడా ఎలా గుర్తించాలి? సమాజం, కుటుంబం, కెరీర్, రిలేషన్‌షిప్స్‌ – వీటిని హేతుబద్ధంగా చూడటానికి సహాయపడే విధానం. 2. సమ్యక్ సంకల్పం (Right Intention) – ధ్యేయం & లక్ష్యం తప్పు ఆశయాలకు లోనవకుండా, మంచి లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవాలి? ద్వేషం, స్వార్థం, అజ్ఞానాన్ని విడిచిపెట్టడం – ఇవి వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? 3. సమ్యక్ వాక్కు (Right Speech) – కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి మాటలు, నమ్మకాన్ని పెంచే సంభాషణ – వ్యక్తిత్వ వికాసానికి మౌఖిక నైపుణ్యం ఎలా ఉపయోగపడుతుంది? అసత్యం, గాసిప్, ద్వేషపూరిత వ్యాఖ్యలు – ఇవి మన ప్రగతికి అడ్డంకులు. 4. సమ్యక్ కర్మ (Right Action) – నైతిక ప్రవర్తన సమాజంలో సరైన ప్రవర్తన ఎలా అవ్వాలి? యువత తమ పనుల్లో నైతికతను ఎలా పాటించాలి? 5. సమ్యక్ ఆజీవికం (Right Livelihood) – కెరీర్ & జీవన విధానం నైతికత ఉన్న వృత్తి ఎలా ఎంచుకోవాలి? స...

బర్కా మదన్

Image
బర్కా మదన్ – మోడల్ నుండి బౌద్ధ సన్యాసినిగా మారిన జీవన ప్రస్థానం బర్కా మదన్ పంజాబ్‌లో జన్మించింది. ఆమె మోడలింగ్ రంగంలో ప్రసిద్ధి పొందింది. 1994లో మిస్ ఇండియా ఫైనలిస్టుగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి, 1996లో ఖిలాడీోం కా ఖిలాడీ సినిమాతో నటిగా గుర్తింపు పొందింది. పలు హిందీ, పంజాబీ సినిమాల్లో నటించింది. టెలివిజన్ సీరియల్స్‌లోనూ కనిపించింది. ఎందుకు బౌద్ధాన్ని స్వీకరించింది? బర్కా మదన్ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి ఉండేది. సినిమాల్లో విజయాన్ని సాధించినప్పటికీ, ఆమె మనసులోని ఖాళీతనాన్ని భర్తీ చేయలేకపోయింది. మాయాజాలంతో నిండిన సినీ రంగం, భౌతిక వాంఛలు ఆమెను అంతర్గత ప్రశాంతతకు దూరం చేస్తున్నట్లు అనిపించేది. 2000లో ఆమె నేపాళ్‌లోని ఒక బౌద్ధ మఠాన్ని సందర్శించింది. అక్కడి ధ్యానం, బౌద్ధ విద్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా, ఆమె తన మనస్సును ప్రశాంతంగా ఉంచే మార్గాన్ని వెతుకుతున్నప్పుడు బౌద్ధం ద్వారా దానిని పొందగలమని గ్రహించింది. ఎలా సన్యాసిగా మారింది? 2012లో ఆమె సినిమాలను పూర్తిగా వదిలిపెట్టి, ధర్మ మార్గాన్ని ఎంచుకుంది. తన భౌతిక...

21 Life Lessons

21 Life Lessons that Buddha Teaches You 1. You have to Care yourself. 2. Take time to know who you are. 3. The more you give, the more you receive. 4. No work is beneath you. 5. Start Meditating. 6. Don't be afraid to take risks. 7. Don't make decisions when you're emotional. 8. Luck works if hard work runs. 9. Be patient and persistent. 10. You don't need to impress everyone. 11. Listen to learn 12. Don't take the easy road. 13. Start reading books. 14. Respect others as you would respect yourself. 15. Narrow down your focus bit by bit. 16. You quit, you lose, you fail. 17. Put your best foot forward. 18. Don't bother what other people think. 19. Learn something new every day. 20. Don't make assumptions. Observe the things as it is. Don't impose your opinions. 21. Believe in yourself

బౌద్ధ ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన *కొడవలి*

 బౌద్ధ ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన *కొడవలి*       కొడవలి అనగానే పంటకోసే పనిముట్టు గుర్తుకొస్తుంది. కానీ ఈ కొడవలి ఒక పురాతన బౌద్ధ క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, గోల్లప్రోలు మండల కేంద్రానికి 15 కి. మీ. దూరంలో, పిఠాపురం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.            కొడవలి బౌద్ధ స్థూపం ప్రాచీన భారత బౌద్ధ సంస్కృతి, చరిత్రకు ఒక అపూర్వ ఉదాహరణ. ఈ స్థూపం సామ్రాట్ అశోకుని కాలమైన క్రీ.పూ. 3-2 శతాబ్దాలకు చెందింది. ఇది బౌద్ధ ధర్మ ప్రచారానికి, ప్రాచీన భారత పురావస్తు సంపదకు అద్భుతమైన సాక్ష్యంగా ఉంది.        కత్తిపూడి-రాజమండ్రి జాతీయ రహదారి సమీపంలో, కొడవలి జంక్షన్ నుండి 3 కి.మీ. దూరంలో ఇది ఉంది. ఇదొక మహాస్థూపం. దీని చుట్టుకొలత 12 మీ. దీన్ని తెల్లని సున్నపు రాయితో నిర్మించారు.1880లో పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఈ స్థూపంలోని రాతి కట్టడాల్లో బ్రాహ్మి లిపిలో శాసనాలు ఉన్నాయి. ఇందులో శాతవాహన రాజు వశిష్టపుత్ర శిరి చందసాత గురించి ప్రస్తావన ఉంది. ఈ శాసనం బౌద్ధ ధర్మానికి ఆ రాజు చేసిన ప్రోత్సాహాన్ని సూచిస్తోంది. 200...