Posts

Showing posts from March, 2024

మహాబోధి ఆలయం

Image
                 మహాబోధి విహారం           గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ప్రధాన నాలుగు క్షేత్రాలలో బుద్దగయ చాలా ముఖ్యమైనది. మిగిలిన మూడు  కుశీనగర్, లుంబినీ,  సారనాథ్ .        బుద్ధగయ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దక్షిణాన 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం కాదు.ఇది బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. 2600సంవత్సరాల కిందట నేటి బుద్ధగయను ఉరువేల అని పిలిచేవారు. ఇది ఫాల్గు నది ఒడ్డున ఉంది .        బుద్ధుని బోధనలు తెలుసుకొని అశోక చక్రవర్తి అశోక బౌద్ధునిగా మారాడు.చక్రవర్తి అశోకుడు  బుద్ధగయలో 288 BCE లో ఒక స్థూపాన్ని, మహాబోధి విహారాన్ని  నిర్మించాడు. ఈ విహారం కుషానుల కాలంలో క్రీ.శ.2వ శతాబ్దంలో తిరిగి నిర్మించబడింది.  ఒక శిలాఫలకాన్ని నిర్మించారు. మహాబోధి విహారం భారతదేశంలో కనిపించే పురాతన ఇటుక నిర్మాణాలలో ఒకటి. బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానిక...

లుంబినీ వనం

Image
లుంబినీ వనం            లుంబినీ వనం( nepal) pc Wikipedia             600 BCE నాటికి నేపాల్  దక్షిణ ప్రాంతాలలో చిన్న గణ రాజ్యాలు, వంశాల సమాఖ్యలు ఏర్పడ్డాయి. అలాఏర్పడిన వాటిలో ఒకటి శాక్య రాజ్యం. 250 BC నాటికి ఈ  దక్షిణ ప్రాంతాలు అశోక చక్రవర్తి  ఏలుబడి లో ఉన్న మౌర్య సామ్రాజ్యం ప్రభావంలోకి వచ్చాయి . సాధారణ శకం 4వ శతాబ్దం  నాటికి లిచ్ఛవి వంశస్థులు అధికారంలోకి వచ్చారు. అప్పటికి నేపాల్‌లో ఎక్కువ భాగం గుప్త సామ్రాజ్యం ప్రభావంలోకి  వచ్చింది. నేపాల్ లోని ఖాట్మండు లోయలో ఉన్న వారిని కిరాతులు అన్నారు. పృథ్వీ నారాయణ్ షా అనే  గూర్ఖా రాజు 1769 నాటికి లోయలోని అన్ని రాజ్యాలను (స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న కీర్తిపూర్‌తో సహా)  కలిపి ఏకీకృతం చేశాడు.  1923 నాటికి అది ప్రత్యేక దేశంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. హిందువులు ఎక్కువగా ఉన్న నేపాల్ హిందూ దేశం గా ప్రసిద్ధి పొందింది అయితే 2006లో మావోయిస్టు పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అది లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశంగా  మారింది...