చిరునవ్వుతో గమనించడమే ధ్యానం
చిరునవ్వుతో గమనించడమే ధ్యానం మనం మన శరీరాన్ని సాక్షిగా గమనించాలి. "సాక్షి" తన "స్వంత" అభిప్రాయానికి ప్రాధాన్యత నివ్వకుండా సత్యంగా అక్కడ జరిగినది జరిగినట్టుగా లేక చూచిన దానిని చూచినట్లుగా చెప్పే అవకాశం ఉంటుంది. బుద్ధుడు ఏది చెప్పినా ప్రకృతి యొక్క ధర్మాన్నే చెబుతాడు. ప్రకృతి ధర్మాలలోని ఒక ధర్మమేమిటంటే మనం మనలోని రాగద్వేషాలను గమనిస్తూ పోతే అవి తగ్గుతూ పోతాయి. అలాగాక అనుభవిస్తూ పోతే అవి పెరుగుతూ పోతాయి. అందువల్లనే రాగ ద్వేషాలను చిరునవ్వుతో సాక్షి లాగా గమనించమన్నాడు. మనం ధ్యానం చేసే సమయంలో వెన్నుపూసను నిటారుగా చేసికొని, ముఖంలో చిరునవ్వును కలిగి ఉండాలి. ."ఆ చిరునవ్వే" మనలో "సాక్షి భావాన్ని" పెంచటానికి అత్యంత ఆవశ్యకం. అంతేకాదు అది మన "జీవన కళ" కు అంటే ఆనందమయ జీవితానికి కూడా బహుళ ప్రయోజనకారి. బుద్ధుడు మనలో సాక్షీ భావాన్ని ఎలా పెంచుకోవాలో మధ్యమనికాయలో వివరించాడు. 1. సాధకుడు "ధీర్ఘంగా శ్వాస" ను తీసి కొనేటప్పుడు (ఇది ప్రథమ స్థాయి) దీర్ఘంగా శ్వాసను తీసుకొంటున్నట్లు, శ్వాసను వదిలేటప్పుడు కూడా దీర్ఘంగా విడిచిపెడుతు న్నట్లు గమనిస...