Posts

Showing posts from July, 2020

బౌద్ధం అంటే

Image
బౌద్ధం అంటే నువ్వు ఎవరి మీదా ఆధారపడకుండా నీ స్వబుద్ధితో  నీకు నీవుగా బుద్ధుడిగా(జ్ఞానిగా) మారడమే బౌద్ధం. 💧సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధం. 💧సత్యాన్ని గ్రహించినవాడిగా అనేకులకు ఆ సత్యాన్ని తెలియజేస్తూ, ధమ్మాన్ని ఆచరిస్తూ సంఘంలో జీవించడమే బౌద్ధం.

తెలుగు ప్రాంతాలలో జైనం

Image
జైన ధర్మం క్రీ.పూ నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణ వల్ల కృష్ణా నదికి ఉత్తరంగా తీరప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు  అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని   కొనకుండ్లలో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంభర శాఖలకు ఆదరణీయమైంది.  గుంటుపల్లి (కామవరపుకోట) లోని గుహలు   జైనులకు సంబందించిన గుహలుగానే భావిస్తున్నారు. ఇవికాక రామతీర్థం (నెల్లిమర్ల) , శాలిహుండం మొదలగుచోట  చిన్న  స్తూపాలు, జైన స్వస్తిక చిహ్నాలు ఇక్కడ జైన మతం విస్తరించిందని తెలుస్తోంది. అయితే ఇది బౌద్ధం లాగా సామాన్య ప్రజల్లోకి చొచ్చుకొని పోలేదు. అనంతపురం జిల్లా లోని వజ్రకరూరు మండలంలోని కొ...

అన్ని ధర్మాలను కొంచెం కొంచెం తమలో కలిపేసుకున్న జైనం

Image
సనాతనధర్మం గా చెప్పుకునే జైనం లక్షల సంవత్సరాలకు ముందే ఉందని చెబుతారు. మహావీరుని కి 24000 సంవత్సరాల ముందు అరిష్టనేమి ఉండేవారని, ఆయన కంటే 50000 సంవత్సరాల ముందు నేమి ఉండేవారని జైన సంప్రదాయం చెబుతుంది.ఇది వాస్తవ దూరంగా ఉంది. జైనులు బట్టలు వేసుకొని ఉండాలా వద్దా అనే సమస్యపై రెండుగా విడిపోయారు.తెల్లని వస్త్రాలు ధరించాలని చెప్పేవారిని శ్వేతాంబరులు అన్నారు.వస్త్రాలు ఏమాత్రం అవసరం లేదని చెప్పే వారిని దిగంబరులు అన్నారు. జైన తీర్థంకరులు లో ఆఖరి వాడు, ప్రసిద్ధుడు మహావీరుడు.ఇతను బుద్ధుని సమకాలికుడు. బుద్ధుని కంటే పెద్దవాడు. జైనమతంలో  1) 14 పూర్వ గ్రంధాలు 2)11 అంగ గ్రంధాలు ఉన్నాయి.ఈ గ్రంథాలు ఇప్పుడు లభించడం లేదు. అయితే  ఉమా స్వాతి రచన తత్వార్థాధిగమ సూత్ర అనే గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా రెండు శాఖలు అంగీకరించాయి.        జైనులు 'అనేకాంత వాదం' ను ప్రతిపాదించారు. ఇది ఉపనిషత్తులు ప్రతిపాదించిన శాశ్వత వాదానికి బుద్ధుడు ప్రతిపాదించిన క్షణిక వాదానికి మధ్యస్తంగా ఉంటుంది. శాశ్వతం ఎంత సత్యమో మార్పు అంత సత్యం అన్నారు. పదార్థాల ఉనికికి ఆధారమైన ద్రవ్యం మాత్రమే శాశ్వతమైనదని...

గౌతమబుద్ధ

Image
  గౌతమబుద్ధ    ప్రపంచంలోని  తాత్వికులలో  గౌతమబుద్ధునికి విశిష్టమైన స్థానముంది. కొందరు ఆయనను ఆసియా జ్యోతిగా వర్ణిస్తే, మరికొందరు  ప్రపంచజ్యోతిగా భావిస్తున్నారు.         బుద్దుడు   క్రీ.పూ.563లోవైశాఖ పూర్ణిమలో నేటి నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరానికి సమీపంలో లుంబినీ గ్రామంలో జన్మించారు. అతని జన్మస్థలంలో అశోకుని రుమ్మిండి స్థంచశాసనంలో 'శాక్యమునియైన బుద్ధుడు ఇక్కడ జన్మించాడు' అని రాయబడివుంది.          ‌   బుద్ధునికి చిన్న తనంలో సిద్దార్థ్ అనే పేరు పెట్టారు.    సిద్ధార్థ్ శుద్దోధన్, మాయాదేవిల కుమారుడు. అప్పటికాలంలో గణ సమాజాలుండేవి. శాక్య గణానికి చెందిన శుద్దోధన్ కపిలవస్తు నగరానికి అధినేత.గణ సంఘ సభ్యుల సమిష్టి నిర్ణయాల మేరకు పరిపాలన సాగేది. మాయాదేవి దేవోదహ రాకుమార్తె. మాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళుతూ మార్గ మధ్యంలో లుంబినీ వనంలో సిద్ధార్థునికి జన్మనిచ్చింది. కాని ఆమె  వారం రోజులకే  కన్ను మూసింది. దాంతో ఆమె పినతల్లి  గౌతమి ప్రజాపతిసిద్ధార్థుని పెంచి ...