బుద్ధిమయం అయింది బౌద్ధం
బుద్ధుని ధర్మం మనుషుల్ని మనిషిగా ఉంచుతుంది.మనిషి ఆనందంగా జీవించా లంటే,విజయవంతంగా ,ఫలవంతగా జీవించాలను కుంటే బుద్ధుని ఉపదేశాలు పాటించడం చాలా అవసరం.సామాన్య ప్రజలు బుద్ధ భగవానుని బోధనలు అర్థం చేసుకోవడం కష్టం.కాబట్టి అవి అర్థం చేసుకొని ఆచరించేవారు బుద్ధ భగవానుని బోధనలు గురించి తెలియజేయాలి. ఇక్కడ భగవాన్ అనేది గౌరవ వాచకం. భగవాన్ బుద్ధ అని గౌరవంగా పిలుస్తారు. ధర్మం ఈ సమాజాన్ని రక్షిస్తుంది.మనం ధర్మాన్ని రక్షించాలి. "ఈ లోకంలో దుక్ఖం ఉంది. దానికి కారణం ఉంది.నివారణ ఉంది" అని బుద్ధుడు అంటారు. నూటికి 90 శాతం మంది ఏదో ఒక బాధ తో దుక్ఖిస్తున్నారు.దుక్ఖంతో బాధపడుతున్న వారిని విముక్తులను చేయాలని బౌద్ధం చెబుతుంది. బౌద్ధ ధర్మానికి హేతువు పునాది.మానవులు ప్రగతి మార్గం లో నడిచేందుకు తగిన ఉత్సాహాన్ని కలిగించే అంశాలు బౌద్ధం లో ఉన్నాయి. బుద్ధుని సూత్రాలు, బోధనలు శాశ్వతంగా నిలిచాయి.2500 సంవత్సరాలకు పైగా బౌద్ధం నిలిచి ఉంది.ప్రపంచ దేశాల మేధావులందరూ బౌద్ధాన్ని అభిమానిస్తూ అనుసరిస్తున్నారు. "బుద్...