రాగద్వేషాలను అధిగమించకుండా మనుషుల్లో సమిష్టితత్వం పెరగదు
రాగద్వేషాలను అధిగమించకుండా మనుషుల్లో సమిష్టితత్వం పెరగదు బాలగోపాల్ మార్క్సిస్టు సిద్ధాంతానికి అదనపు చేర్పుగా ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాన్ని జోడించాలని ప్రతిపాదించాడు తన 'మనిషి మార్క్సిజం' వ్యాసంలో. మానవ ప్రవృత్తికి బయట ప్రపంచానికి మధ్యనున్న ఘర్షణకు ఫ్రాయిడ్ మనస్తత్వశాస్త్ర సిద్ధాంతంలో కేంద్ర స్థానం ఉంది. మనిషి వ్యక్తిత్వ వికాసానికి వైఫల్యానికి ఈ ఘర్షణే మూలమని ఫ్రాయిడ్ అభిప్రాయం. సమాజిక వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడల్లా మనిషి ప్రవర్తనలో కూడా దానికి తగినట్లుగా మార్పు అనివార్యంగా వస్తుందని , దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించనవసరం లేదని గతితార్కిక భౌతిక వాదం చెప్తుందని, ఇది నిజం కాదని బాలగోపాల్ వాదిస్తాడు. దీన్ని సాహిత్యకారులు తప్పకుండా గుర్తించి ఉంటారని ఆయన భావిస్తాడు. రాగో నవల మీద వ్యాఖ్యానిస్తూ ఈ విషయాలను చెప్తాడు ప్రస్తావించాడు. రాగో స్త్రీలను స్త్రీల వ్యక్తిత్వాలను కించపరిచే ఆచారాలు పట్ల వ్యతిరేకంగా తమకు అందుబాటులో ఉన్న ఉద్యమాలకు వస్తుంది. ఆ ఉద్యమాలు పరిమితమైనవి. కానీ ఆ ఉద్యమాల లక్ష్...