Posts

బౌద్ధం అంటే

Image
బౌద్ధం అంటే నువ్వు ఎవరి మీదా ఆధారపడకుండా నీ స్వబుద్ధితో  నీకు నీవుగా బుద్ధుడిగా(జ్ఞానిగా) మారడమే బౌద్ధం. 💧సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధం. 💧సత్యాన్ని గ్రహించినవాడిగా అనేకులకు ఆ సత్యాన్ని తెలియజేస్తూ, ధమ్మాన్ని ఆచరిస్తూ సంఘంలో జీవించడమే బౌద్ధం.

తెలుగు ప్రాంతాలలో జైనం

Image
జైన ధర్మం క్రీ.పూ నాలుగో శతాబ్దానికే ఆంధ్రదేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. కళింగ రాజైన ఖారవేలుడి ఆదరణ వల్ల కృష్ణా నదికి ఉత్తరంగా తీరప్రాంతంలో ముందంజ వేసింది. అశోకుడి పుత్రుడు సంప్రతి ఆంధ్ర, ద్రవిడ దేశాల్లో జైన వ్యాప్తికి కృషి చేశాడు. అమరావతి సమీపంలోని వడ్డమాను కొండపై సంప్రతి విహారం ఏర్పడింది. అక్కడే ఖారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకారంభంలో సుప్రసిద్ధ జైనాచార్యుడైన కొండకుందాచార్యుడు  అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలోని   కొనకుండ్లలో ఆశ్రమం నిర్మించుకుని మతప్రచారం చేస్తూ సిద్ధాంత గ్రంథాలు రచించాడు. వాటిలో సమయసార అనే గ్రంథం శ్వేతాంబర, దిగంభర శాఖలకు ఆదరణీయమైంది.  గుంటుపల్లి (కామవరపుకోట) లోని గుహలు   జైనులకు సంబందించిన గుహలుగానే భావిస్తున్నారు. ఇవికాక రామతీర్థం (నెల్లిమర్ల) , శాలిహుండం మొదలగుచోట  చిన్న  స్తూపాలు, జైన స్వస్తిక చిహ్నాలు ఇక్కడ జైన మతం విస్తరించిందని తెలుస్తోంది. అయితే ఇది బౌద్ధం లాగా సామాన్య ప్రజల్లోకి చొచ్చుకొని పోలేదు. అనంతపురం జిల్లా లోని వజ్రకరూరు మండలంలోని కొ...

అన్ని ధర్మాలను కొంచెం కొంచెం తమలో కలిపేసుకున్న జైనం

Image
సనాతనధర్మం గా చెప్పుకునే జైనం లక్షల సంవత్సరాలకు ముందే ఉందని చెబుతారు. మహావీరుని కి 24000 సంవత్సరాల ముందు అరిష్టనేమి ఉండేవారని, ఆయన కంటే 50000 సంవత్సరాల ముందు నేమి ఉండేవారని జైన సంప్రదాయం చెబుతుంది.ఇది వాస్తవ దూరంగా ఉంది. జైనులు బట్టలు వేసుకొని ఉండాలా వద్దా అనే సమస్యపై రెండుగా విడిపోయారు.తెల్లని వస్త్రాలు ధరించాలని చెప్పేవారిని శ్వేతాంబరులు అన్నారు.వస్త్రాలు ఏమాత్రం అవసరం లేదని చెప్పే వారిని దిగంబరులు అన్నారు. జైన తీర్థంకరులు లో ఆఖరి వాడు, ప్రసిద్ధుడు మహావీరుడు.ఇతను బుద్ధుని సమకాలికుడు. బుద్ధుని కంటే పెద్దవాడు. జైనమతంలో  1) 14 పూర్వ గ్రంధాలు 2)11 అంగ గ్రంధాలు ఉన్నాయి.ఈ గ్రంథాలు ఇప్పుడు లభించడం లేదు. అయితే  ఉమా స్వాతి రచన తత్వార్థాధిగమ సూత్ర అనే గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా రెండు శాఖలు అంగీకరించాయి.        జైనులు 'అనేకాంత వాదం' ను ప్రతిపాదించారు. ఇది ఉపనిషత్తులు ప్రతిపాదించిన శాశ్వత వాదానికి బుద్ధుడు ప్రతిపాదించిన క్షణిక వాదానికి మధ్యస్తంగా ఉంటుంది. శాశ్వతం ఎంత సత్యమో మార్పు అంత సత్యం అన్నారు. పదార్థాల ఉనికికి ఆధారమైన ద్రవ్యం మాత్రమే శాశ్వతమైనదని...

గౌతమబుద్ధ

Image
  గౌతమబుద్ధ    ప్రపంచంలోని  తాత్వికులలో  గౌతమబుద్ధునికి విశిష్టమైన స్థానముంది. కొందరు ఆయనను ఆసియా జ్యోతిగా వర్ణిస్తే, మరికొందరు  ప్రపంచజ్యోతిగా భావిస్తున్నారు.         బుద్దుడు   క్రీ.పూ.563లోవైశాఖ పూర్ణిమలో నేటి నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరానికి సమీపంలో లుంబినీ గ్రామంలో జన్మించారు. అతని జన్మస్థలంలో అశోకుని రుమ్మిండి స్థంచశాసనంలో 'శాక్యమునియైన బుద్ధుడు ఇక్కడ జన్మించాడు' అని రాయబడివుంది.          ‌   బుద్ధునికి చిన్న తనంలో సిద్దార్థ్ అనే పేరు పెట్టారు.    సిద్ధార్థ్ శుద్దోధన్, మాయాదేవిల కుమారుడు. అప్పటికాలంలో గణ సమాజాలుండేవి. శాక్య గణానికి చెందిన శుద్దోధన్ కపిలవస్తు నగరానికి అధినేత.గణ సంఘ సభ్యుల సమిష్టి నిర్ణయాల మేరకు పరిపాలన సాగేది. మాయాదేవి దేవోదహ రాకుమార్తె. మాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళుతూ మార్గ మధ్యంలో లుంబినీ వనంలో సిద్ధార్థునికి జన్మనిచ్చింది. కాని ఆమె  వారం రోజులకే  కన్ను మూసింది. దాంతో ఆమె పినతల్లి  గౌతమి ప్రజాపతిసిద్ధార్థుని పెంచి ...

అంబేద్కర్ అడుగుజాడల్లో

Image
అంబేద్కర్ అడుగుజాడల్లో.. (తేదీ:14/4/2020 అంబేద్కర్ జయంతి సందర్భంగా)        రాజ్యాంగ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన ఉపన్యాసంలో "నాయకుడిని గుడ్డిగా నమ్మి పూజించడమనే చెడు మనస్తత్వం భారతీయుల్లో అనాదిగా జీర్ణించుకుని ఉంది. దేశానికి,  ప్రజానీకానికి నిస్వార్ధంగా సేవ చేసిన నాయకుని గౌరవించడంలో తప్పులేదు. కానీ ఆ నాయకున్ని సర్వశక్తి సంపన్నుడుగా ఎంచి  సమస్తమైన బాధ్యతలు ఆయనపైనే ఉంచి,  అన్యధా శరణం నాస్తి అనే ధోరణిలో ప్రజానీకం వ్యవహరించడం   అత్యంత విషాదకర పరిణామాలకు దారి తీస్తుంది. ఈ వ్యక్తి పూజ విధానం దేశానికి,  ప్రజానీకానికి అత్యంత నిమ్నదశగా దిగజారుస్తుంది. దేశ స్వాతంత్రంను   పరిరక్షించుకునే విషయంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మడం అనేది ప్రమాదకరం" అని అన్నారు.      మన భారతదేశంలో భక్తి తత్వం అనేది అత్యంత దారుణమైన విధంగా ఉంటోంది. ఈ భక్తితత్వం నింపాదిగా రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించింది.  వ్యక్తి పూజ దేశాన్ని కృంగదీసి సర్వ  ఆధిపత్యానికి దారితీస్తోంది. అదేవిధంగా రాజకీయాల్లో భక్తి తత్వానికి వ్యక్తిపూజకు ఏ మాత్రం ...

నగరాన్ని జయించబోయిన నక్క

Image
                   వారణాసి నగరంలో ఒక గొప్ప పండిత కుటుంబంలో బోధిసత్వుడు జన్మించాడు. అతడు యుక్త వయస్కుడయ్యేనాటికి సర్వ శాస్త్రాలూ అభ్యసించి, పండితులందరితోనూ గొప్పవాడనిపించుకున్నాడు. ఆ కారణంగా ఆ దేశరాజు  చిన్న వయసైనప్పటికీ బోధిసత్వుని తన ఆస్థానంలో ప్రధాన పురోహితునిగా నియమించాడు.         బోధిసత్వుడు తాను శాస్త్రగ్రంథాలు చదివే సమయంలో, ఒక అద్భుతమైన వశీకరణ మంత్రాన్ని కనుగొన్నాడు. దాని ప్రభావంతో ఇతరుల మీద సర్వాధికారాలు చలాయించవచ్చు. ఆ మంత్రం ఒక్కసారి చదివితే, ఎంతటి వాళ్ళయినా దాసోహం అనాలసిందే! ఆ మంత్ర ప్రభావంతో ఎవరిపైనా అధికారం నెరపాలని బోధిసత్వుడికి ఆశలేదు కాని, దాన్ని మరిచిపోకుండా జాగ్రత్తపడాలన్న ఆలోచన కలిగింది. అరణ్యంలో ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకుని,అక్కడ వున్న ఒక ఎత్తయిన రాతిపై కూర్చుని, ఆయన పరిసరాలను ఒకసారి చూశాడు. ఎక్కడా మనిషిగానీ, జంతువుగానీ ఆయన కంటబడలేదు. బోధిసత్వుడు ఆ అద్భుత మంత్రాన్ని గొంతెత్తి చాలాసార్లు చదివి, సూర్యాస్తమయం అవుతూండగా, రాతి మీది నుంచి లేచి నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో ర...

అంబేద్కర్ చెప్పిన సూక్తులు

Image
◆ People who have not decided their objective they can't get any sucess. When they dont get any success, they can't make any impact in the history of the time.  ◆ ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు.                 ◆ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం. ◆ నా దేశ సమస్యలకు-నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతి కి ప్రాముఖ్యత ఇస్తాను.కానీ నేను - నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ◆దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.ప్రతిపౌరుని నైతికాభివృద్దే దేశాభివృద్ధి. ◆జీవించేందుకు తినాలి.సమాజ సంక్షేమానికై జీవించాలి. ◆నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే... జనం లో నిలిచి పోతావు. ◆ఓటుహక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ◆ కులం పునాదుల మీద ఒక జాతిని గాని, నీతినిగాన...