అజంతా గుహలు

అజంతా గుహలు

అజంతా గుహలు భారతీయ బౌద్ధ శిల్పకళకు, బౌద్ధ చిత్రకళకు,బౌద్ధ ధర్మానికి చిరస్మరణీయమైన వారసత్వం. ఈ గుహలు మనకు బౌద్ధ జీవన విధానంపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి.ఈ గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరూలా నదికి సమీపంలో ఉన్న ఒక పర్వత శ్రేణిలో ఉన్నాయి. అజంతా గుహలను UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.

అజంతా గుహల ముఖ్య విశేషాలు:
         ఈ గుహలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 6వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. ఇవి రెండు ప్రధాన దశలలో నిర్మించబడినాయి

1.తొలిదశ: థేరవాద బౌద్ధం (హీనయాన) ప్రభావంతో గుహలు 9 నుండి 12 వరకు నిర్మించబడినాయి. ఈ గుహలు బౌద్ధ భిక్షువులు, వ్యాపారులు, మద్దతుదారుల విరాళాల ఆధారంగా నిర్మించబడ్డాయని తెలుస్తోంది.
2. ద్వితీయ దశ: మహాయాన బౌద్ధ ప్రభావం తో గుహలు 1 నుండి 8 మరియు 13 నుండి 30 వరకు నిర్మించారు.హరిషేణుడు అనే వాకాటక రాజు (సుమారు క్రీస్తుశకం 460–478) ఆధ్వర్యంలో ఈ ద్వితీయ దశ గుహలు నిర్మించబడ్డాయి.
         గుహ 16, 17, 19, 26 మొదలైనవి అతని కాలంలో లేదా అతని అనుయాయుల కాలంలో నిర్మించబడ్డాయని శాసనాల ద్వారా తెలుస్తోంది.
       అజంతాలో మొత్తం 30 గుహలు ఉన్నాయి. వీటిలో:
• చైత్య గృహాలు (బౌద్ధ ప్రార్థనా మందిరాలు): ఉదాహరణకు గుహ 9, 10, 19, 26
• విహారాలు (బౌద్ధ మఠాలు): ఉదాహరణకు గుహ 1, 2, 4, 6
• చిత్రకళ: అజంతా గుహలలోని గోడలపై బుద్ధుని జీవితం, జాతక కథలు, ధార్మిక దృశ్యాలు ఉన్న అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఇవి నేచురలిస్టిక్ శైలిలో వేసినవి. ముఖ్యంగా గుహ 1, 2, 16, 17 లోని చిత్రాలు ప్రఖ్యాతి గాంచాయి
• శిల్పకళ: ఈ గుహల్లో ఉన్న బుద్ధుని విగ్రహాలు, రాతి స్తంభాలు, కమానులు, శిల్పాలు అత్యంత శిల్ప నైపుణ్యంతో చెక్కబడ్డాయి.

• నిర్మాణ పద్ధతి:
      ఈ గుహలు నేరుగా కొండను చెక్కడం ద్వారా నిర్మించబడ్డాయి. ఇది రాక్-కట్ ఆర్కిటెక్చర్‌కు అద్భుత ఉదాహరణ.

• బౌద్ధ ధర్మ ప్రబోధన కేంద్రం:
     అజంతా గుహలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాక, విద్యా కేంద్రాలుగా కూడా ఉండేవి. దేశ విదేశాల నుంచి భిక్షువులు ఇక్కడికి వచ్చేవారు.

      వెలుగులోకి వచ్చిన చరిత్ర:

       1819లో బ్రిటిష్ అధికారి జాన్ స్మిత్ అనే వ్యక్తి ఈ గుహలను కనిపెట్టేదాకా వీటి గురించి ప్రపంచానికి తెలీదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు, ముఖ్యంగా జేమ్స్ బర్జెస్, ఫెర్గూసన్, అజంతా గుహలను పునఃసర్వే చేసి వాటి చిత్రాలు, ఆకృతులు, శిల్పాలు, గుహల సంఖ్య గురించి ఆధునిక ప్రపంచానికి పరిచయం చేశారు.
 
2. చారిత్రక గ్రంథాలు:

చీన బౌద్ధ యాత్రికుడు ఫాహియెన్ (Faxian) మరియు హ్యూయెన్ త్సాంగ్ (Xuanzang) భారతదేశాన్ని సందర్శించినప్పుడు బౌద్ధ కేంద్రాల గురించి రాసినారు. అయితే వారు అజంతా గుహల గురించి నేరుగా ప్రస్తావించలేదుగానీ, అజంతా శైలికి దగ్గరలోని ఇతర బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనేక పరిశోధనలు చేసి అజంతా గుహల కాలాన్ని, నిర్మాణ శైలిని వివరించింది.చిత్రాలను, శిల్పాలను రక్షించేందుకు కృషి చేసింది.

    చిత్రలేఖన శైలి, వేషధారణ, అలంకారాలు, గృహ నిర్మాణ శైలి ఆధారంగా పరిశోధకులు గుహల కాలాన్ని అంచనా వేశారు. జాతక కథల ఆధారంగా గోడ చిత్రాలు వెయ్యబడిన తీరును అధ్యయనం చేయడం ద్వారా బౌద్ధం ఏ దశలో ఉండేదో అర్థమవుతుంది.

1. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం:
అజంతా గుహల తొలి దశ ఈ కాలంలో ప్రారంభమైంది. హీనయాన బౌద్ధ సంప్రదాయానికి చెందిన భిక్షువులచే చైత్యగృహాలు (ప్రార్థనా మందిరాలు) మరియు విహారాలు (వాసస్థానాలు) కొండను తొలిచి రూపొందించబడ్డాయి. ఈ గుహల్లో బుద్ధుని రూపాలను కాకుండా, చిహ్నాల రూపంలో (ధర్మచక్రం, బోధివృక్షం మొదలైనవి) పూజించబడింది.

2. క్రీస్తుశకం 5వ శతాబ్దం (సుమారు 460–480):
వాకాటక సామ్రాజ్యంలోని శక్తిమంతమైన రాజు హరిషేణుడు పాలించిన కాలం. ఈ దశలో మహాయాన బౌద్ధ సంప్రదాయ ప్రభావంతో గుహల నిర్మాణం విస్తరించింది. ఈ దశలో బుద్ధుని విగ్రహాలు, గుండ్రటి స్థూపాలు, కథాచిత్రాలు, శిలాశిల్పాలు ప్రాముఖ్యత పొందాయి. గుహలు 1, 2, 16, 17, 19, 26 ముఖ్యమైనవి. ఈ నిర్మాణాలకు ఆర్థిక మద్దతు రాజు సహా రాజచరిత్రకులు, వాణిజ్యవర్గాలు, భక్తులు అందించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది.

3. 6వ శతాబ్దానంతరం:
        బౌద్ధ ధర్మ పతనంతో అజంతా గుహల ప్రాముఖ్యత తగ్గింది. వీటినెవరూ పట్టించుకోక పోవడంతో శతాబ్దాలపాటు అజంతా గుహలు కాలచక్రంలో మరుగునపడ్డాయి.

4 1983 – UNESCO ప్రపంచ వారసత్వ గుర్తింపు:
          అజంతా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ గుహల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి పరిరక్షణకు అంతర్జాతీయ మద్దతు లభించింది.అజంతా గుహలు భారతీయ బౌద్ధ చరిత్రలో అత్యంత విలువైన పురావస్తు సంపదగా నిలుస్తాయి.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు