మహాబోధి ఆలయం
మహాబోధి విహారం
గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ప్రధాన నాలుగు క్షేత్రాలలో బుద్దగయ చాలా ముఖ్యమైనది. మిగిలిన మూడు కుశీనగర్, లుంబినీ, సారనాథ్ .
బుద్ధగయ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దక్షిణాన 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం కాదు.ఇది బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. 2600సంవత్సరాల కిందట నేటి బుద్ధగయను ఉరువేల అని పిలిచేవారు. ఇది ఫాల్గు నది ఒడ్డున ఉంది .
బుద్ధుని బోధనలు తెలుసుకొని అశోక చక్రవర్తి అశోక బౌద్ధునిగా మారాడు.చక్రవర్తి అశోకుడు బుద్ధగయలో 288 BCE లో ఒక స్థూపాన్ని, మహాబోధి విహారాన్ని నిర్మించాడు. ఈ విహారం కుషానుల కాలంలో క్రీ.శ.2వ శతాబ్దంలో తిరిగి నిర్మించబడింది. ఒక శిలాఫలకాన్ని నిర్మించారు. మహాబోధి విహారం భారతదేశంలో కనిపించే పురాతన ఇటుక నిర్మాణాలలో ఒకటి. బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఒక రాయిని చెక్కారు. దీనిని డైమండ్ సింహాసనం అని పిలుస్తారు . ఇది ఇప్పటికీ ఉంది.
అయితే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ మహాబోధి విహారం పునరుద్ధరణ క్రీ. శ.. 7లో గుప్త రాజుల పాలనలో పూర్తయింది.మళ్లీ
1882లో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆధ్వర్యంలో మయన్మార్(బర్మా) బౌద్ధులచే పునరుద్ధరించబడింది. 1956లో 2500వ బుద్ధ జయంతి ఉత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం కొన్ని మరమ్మతులు చేసి మహాబోధి మహావిహార ప్రాంగణాన్ని విస్తరించింది. 2002లో బుద్దగయ లో ఉన్న మహాబోధి మందిరాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా UNESCO గుర్తించింది.
బుద్ధుడు 563 BCలో నేపాల్లోని లుంబినీ వనంలో వైశాఖ పూర్ణిమ [క్యాలెండర్ సంవత్సరాలలో పౌర్ణమి సమయంలో ప్రారంభం కాని రెండవ పౌర్ణమి] నాడు జన్మించాడని నమ్ముతారు. సిద్ధార్థుడు 534 BCలో 29 సంవత్సరాల వయస్సులో ప్రజలు పడే దుఃఖాన్నుంచి బయటపడడానికి మార్గాన్ని కనుక్కోవడానికి తన కుటుంబ బంధాన్ని తెంచుకుని గయకు వచ్చాడు. గయలోని ఉరువేల (బుద్ధగయ)లో రావి చెట్టు నీడలో ఆరేళ్లపాటు కఠోరమైన ధ్యానం చేశాడు. అప్పట్లో ఉరువేల ఒక పెద్ద అడవి ప్రాంతం. ఈ చెట్టు నీడలో సిద్ధార్థ గౌతముడు వైశాఖ పూర్ణిమ (మే నెల) పౌర్ణమి రోజున ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు. ఇది ఫికస్ రిలిజియోసా అనే బొటానికల్ పేరు కలిగిన పీపాల్ చెట్టు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొదటి వారం ధ్యానంలో గడిపింది ఈ చెట్టు కిందనే. రాజభవనంలో అనుభవించిన ఆనందం, సన్యాసి జీవితంలోని బాధ ఒకటేనని సిద్ధార్థుడు గ్రహించింది ఇక్కడే. రెండింటికీ ఇంద్రియాలను ఉత్తేజపరిచే గుణాలున్నాయి.
ఒకరోజు దగ్గర ఉన్న ఫాల్గు నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కఠోరమైన ధ్యానం కారణంగా నీరసంతో ఉన్న సిద్ధార్థుడు సొమ్మసిల్లి కింద పడిపోతాడు. ఆ సమయంలో గయ కు చెందిన సుజాత అనే పశువులను కాచే అమ్మాయి సిద్ధార్థుని ముఖంపై నీళ్లు చల్లి అతన్ని మెలుకువలోకి తీసుకొస్తుంది. మరణం ద్వారా మనిషి ఏమి సాధించలేడని చెబుతుంది. అంతో ఎంతో ఆహారం తీసుకోవడం ద్వారానే మనిషి జీవించగలుగు తాడని,అప్పుడు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతాడని చెబుతుంది. తన వెంట తెచ్చుకున్న ఆహారాన్ని సిద్ధార్థునికి ఇస్తుంది.
సిద్ధార్థుడు తన లక్ష్యాన్ని గుర్తించి అప్పటి నుంచి సుజాత తెచ్చిన ఆహారాన్ని తింటూ మళ్లీ ధ్యానం లో నిమగ్నుడవుతాడు. అతను రాత్రిపూట ధ్యానంలో కూర్చున్నాడు . ఉదయించే సూర్యునితో పాటు అతను నాలుగు సమాధానాలు పొందాడు. దాన్ని
జ్ఞానోదయం గా భావించాడు. తన్ను తాను బుద్ధుడి (జ్ఞాని) గా మార్పు చెందాడు . కామం (రాగం), ద్వేషం (ద్వేషం) , మాయ (మోహ) నుండి, దుఃఖం నుంచి పూర్తిగా విముక్తి పొందే నిర్వాణ మార్గాన్ని కనుగొన్నాడు.
సమాజంలో మనిషి పడుతున్న దుఃఖానికి కారణాన్ని కనుగొన్నాడు. దుఃఖ నివారణ మార్గాన్ని ఆయన గుర్తించాడు. దుఃఖానికి కారణం అవిద్య అని, పోగొట్టుకోవడం ద్వారానే మనిషి దుఃఖం నుంచి నుంచి బయటకు రావడానికి అష్టాంగమార్గాలు దోహదపడతాయని ఆయన గుర్తించాడు. వాటిని ప్రజలకు చెప్పాలని నిర్ణయించు కుంటాడు. "నోబుల్ ఎయిట్ఫోల్డ్ పాత్ " అని పిలవబడే ఈ అష్టాంగ మార్గాలను అభ్యసించడం ద్వారా నే నిర్వాణం సాధ్యపడుతుందని గుర్తించాడు.
1700 సంవత్సరాల నాటిదని విశ్వసించబడే బుద్ధుని భారీ చిత్రం కూడా ఇక్కడ ఉంది. బుద్ధ భగవానుడి చిత్రం భూమిస్పర్శ ముద్రలో (భూమిని తాకే భంగిమలో కూర్చున్నట్లు) ఉంది .బుద్ధుని ఈ బృహత్తర విగ్రహం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థానం నుంచి తూర్పు దిక్కులో ఉంది.
అశోకుడు తన కుమార్తె సంఘమిత్రను బుద్ధగయలో సిద్ధార్థునికి జ్ఞానోదయమైన రావిచెట్టు కొమ్మ ను కత్తిరించి దానిని శ్రీలంకలో పెంచమని పంపాడు. అదిప్పుడు శ్రీలంకలోని అనురాధపురంలో మహా వృక్ష మైంది. సంఘమిత్ర కృషి కారణంగా శ్రీలంకలో బౌద్ధమతం వృద్ధి చెంది అది నేడు ప్రభుత్వ మతమైంది.
మానవుడు సృష్టించిన కష్టాలు, పనులు వైపరీత్యాల వల్ల అసలు చెట్టు చాలాసార్లు నాశనం చేయబడింది. అసలు చెట్టు వేర్లు శ్రీ లంకలో పెంచారు. ఆ రావి చెట్టు వేర్లు తెచ్చి తిరిగి నాటడం ద్వారా ఉన్నదే ప్రస్తుత చెట్టు అని చెపుతారు.
సందర్శకులు మహాబోధి ఆలయంలో రావి చెట్టు(పీపల్ ట్రీ)ముందు పూజలు చేస్తారు. పునర్నిర్మించిన ఆలయంలో ఒక ఇటుక పిరమిడ్ టవర్ ఉంది. దాని పైభాగంలో స్థూపం ఉంది. ఆ సందర్భంలోనే, టవర్ బేస్ నాలుగు మూలల్లో నాలుగు చిన్న టవర్లు నిర్మించారు. ఒకప్పుడు, ఈ భవన ప్రతిరూపాలు ఆసియా అంతటా నిర్మించబడినాయి. బగాన్, మయన్మార్ (బర్మా)లో ఉన్న భవనం ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.
ఆలయానికి ఆగ్నేయంలో ఉన్న ఉద్యానవనం కొత్తగా మెడిటేషన్ పార్కుగా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ ధ్యాన కుటీరాలు, చర్చా గోష్టులు జరుగుతాయి.ఇక్కడ రెండు భారీ గంటలు , రెండు నీటి ఫౌంటైన్లతో పాటు లోటస్ పాండ్లు ఉన్నాయి.గయా జిల్లా మేజిస్ట్రేట్ అభ్యర్థన మేరకు శాస్త్రవేత్తల బృందం జూన్ 2007లో పవిత్ర బోధివృక్షం యొక్క కొమ్మను సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకున్నారు.బుద్ధ గయ లో బుద్ధుని జ్ఞానోదయం సందర్భంగా నిర్మించబడిన అనేక ఇతర పురాతన స్థూపాలు, పుణ్యక్షేత్రాల జాడలు ఉన్నాయి
ప్రపంచం నలుమూలల నుండి బౌద్ధులు, పర్యాటకులు బౌద్ధమతాన్ని, ధ్యాన కళను అధ్యయనం చేయడానికి, ఆ ప్రదేశం చుట్టూ ఉన్న సుందరమైన దృశ్యాలను తిలకించడానికి, భారతదేశ ఔన్నత్యాన్ని చాటే చారిత్రక సంఘటనలను తెలుసుకోవడానికి బుద్ధగయను సందర్శిస్తారు.
నవంబర్ 2013న, జనవరి 2018న మహాబోధి ఆలయం, దాని చుట్టూ బాంబు దాడులు జరిగాయి. ఒకటి బుద్ధ విగ్రహం దగ్గర పేలింది. మరొకటి మహాబోధి ఆలయం సమీపంలో పేలింది. మిగిలిన మూడింటిని గుర్తించి అవి పేలడానికి ముందే నిర్వీర్యం చేశారు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇండియన్ ముజాహిదీన్ బాంబు దాడులకు కారణమని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది . ఈ బాంబు పేలుళ్లకు కారణం బౌద్ధుల మెజారిటీ దేశమైన పొరుగున ఉన్న మయన్మార్లో రోహింగ్యా మారణహోమానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బౌద్ధ ప్రదేశాలను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఉగ్రవాదులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను పట్టుకుని వారికి శిక్ష విధించారు.
బోధ్ గయలో, దాదాపు ప్రతి దేశానికి చెందిన బౌద్ధ ఆరామాలు ఉన్నాయి - భూటాన్, చైనా, జపాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, కంబోడియా, థాయిలాండ్ మొదలైనవి. మహాబోధి ఆలయానికి నడక దూరంలో భారతీయ బౌద్ధంలో అంతగా తెలియని విభాగాలకు చెందిన మఠాలు కూడా ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో నిర్మాణ శైలి ఉంటుంది. ప్రతి ఒక్కటి విభిన్న బౌద్ధ సంస్కృతులు, నిర్మాణ శైలులు కలిగి ఉన్నాయి.
ఇండోసాన్ నిప్పోంజి దేవాలయం జపనీస్ శైలిలో సింపుల్ గా ఉంటుంది. భూటానీస్ మొనాస్టరీలో అద్భుతమైన రంగు రంగుల కుడ్యచిత్రాలు కనిపిస్తాయి. టిబెటన్ బౌద్ధ కర్మపా పాఠశాల యొక్క టెర్గార్ మొనాస్టరీ( బౌద్ధ విహారం) అన్ని ఆధునిక విహారాలన్నిటి కన్నా అత్యంత ఆకర్షణీయమైనది. ఇది టిబెటన్ అలంకార కళల వైభవం తో ఉట్టిపడుతూ ఉంటుంది.
థాయ్ టెంపుల్, దాని ఆర్చ్ రూఫ్టాప్ మరియు మెనిక్యూర్డ్ గార్డెన్ల నుండి మెరిసే బంగారు ఆకులతో కూడిన ముదురు రంగుల వాట్ ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఉదయ సాయంకాలలో ధ్యానం జరుగుతుంది. టిబెటన్ కర్మ ఆలయం, డబుల్-డ్రాగన్ బ్రాస్ డోర్ నాకర్స్, నామ్గ్యాల్ మొనాస్టరీ, పెద్ద ధ్యాన మందిరాలు కలిగి ఉన్నాయి. ఇవి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తెరిచి ఉంటాయి.
అధ్యయనం, ధ్యానం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు బుద్ధ గయ కు వస్తుంటారు. ధ్యాన పద్ధతులను అభ్యసించడం లేదా బౌద్ధ బోధనలలో పరిచయ కోర్సుల కోసం లేదా ఆనాటి పాళీ భాషను చదవడం నేర్చుకోవడానికి చాలా మంది వచ్చి ఇక్కడ వారాలు, నెలలు కూడా గడుపుతారు.
__pillaa kumaraswamy,9490122229
Source:
మేకింగ్ సెన్స్ ఆఫ్ బౌద్ధ కళ & ఆర్కిటెక్చర్ _ప్యాట్రిసియా కరెట్జ్కీ (రచయిత)
www.hitwebcounter.com
ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ , డెహ్రాడూన్, ఉత్తరాఖండ్--తుది సాంకేతిక నివేదిక,2009
బ్రిటానికా
వికిపీడియా
Comments
Post a Comment