బౌద్ధ ధర్మ సాహిత్యం_ జాతక కథలు:
జాతక కథలు:
-జాతక కథలను క్రీ.శ. 300 నుంచి క్రీ.శ. 400 మధ్య కాలంలో రచించినట్లు తెలుస్తుంది.
-జాతక కథల్లో చాలా వరకు నీతి కథలే ఉన్నాయి.
-ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, గోలి, నాగార్జునకొండలోని శిల్పఖండాల్లో జాతక కథలు చూడవచ్చు.
-అజంతాలో కొన్ని జాతక కథలు చూడవచ్చు.
-1వ గుహలో మహాజనక జాతకం, 17వ గుహలో మహాహంస, మాతృ పోషక జాతకాల్లోని కొన్ని దృశ్యాలు చెక్కి ఉన్నాయి.
-అమరావతిలో మిత్ర విందకుని కథ, నలగిరిగజ దర్శనం, బుద్ధుడు శ్వేత రూపంలో అవతరించిన కథలు చెక్కి ఉన్నాయి.
-అజంతా గుహల్లోని 1వ గుహలో స్నాన, అంతఃపుర దృశ్యాలు, 16, 17వ గుహల్లో బుద్ధుడి ఉపదేశం, 19వ గుహలో బుద్ధుడి ఎదుట మాతాశిశువులు గల దృశ్యం, 26వ గుహలో బుద్ధుడి మహాపరినిర్యాణం చెక్కి ఉన్నాయి.
Comments
Post a Comment